బిగ్ బ్రేకింగ్: మల్టీస్టారర్ మూవీలో బాలకృష్ణ

ఇకపై తన నుంచి అన్నీ కొత్త సినిమాలు, కొత్త కథలే చూస్తారని.. గౌతమీపుత్ర శాతకర్ణి టైమ్ లో ప్రకటించాడు బాలయ్య. చెప్పినట్టుగానే మల్టీస్టారర్ మూవీలో నటిస్తానని ప్రకటించాడు. అన్నీ కుదిరితే తన సహచర నటులైన…

ఇకపై తన నుంచి అన్నీ కొత్త సినిమాలు, కొత్త కథలే చూస్తారని.. గౌతమీపుత్ర శాతకర్ణి టైమ్ లో ప్రకటించాడు బాలయ్య. చెప్పినట్టుగానే మల్టీస్టారర్ మూవీలో నటిస్తానని ప్రకటించాడు. అన్నీ కుదిరితే తన సహచర నటులైన చిరంజీవి, వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎనౌన్స్ చేశాడు. కేవలం ప్రకటన చేసి ఊరుకోకుండా.. తన 105వ సినిమా మల్టీస్టారర్ మూవీగా వస్తుందని కూడా అంటున్నాడు.

వందో ప్రాజెక్టుగా గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని అందించాడు. బాలయ్య కెరీర్ లోనే ఇది స్పెషల్ మూవీ. ప్రస్తుతం 101వ ప్రాజెక్టుగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో ఇదే మొదటి చిత్రం. ఇక 102వ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది కూడా కొత్త కాంబినేషనే. ఇదే ఊపులో 105వ సినిమా మల్టీస్టారర్ ఉంటుందని అంటున్నాడు బాలయ్య. 

మధ్యలో వచ్చే 103, 104 సినిమాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కుదిరితే వీటిలో ఒక సినిమా పెద్ద ఎన్టీఆర్ బయోపిక్ ఉండొచ్చు. ప్రస్తుతం ఈ హీరో నటించిన పైసా వసూల్ సినిమాకు సంబంధించి స్టంపర్ రిలీజైంది. విడుదలైన 12 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.