బండ్లకు నిద్రపట్టలేదంట

నిర్మాత బండ్ల గణేష్ సినిమా నిర్మించి కాస్త బాగానే గ్యాప్ వచ్చింది. ఆ మధ్య కాటమరాయుడు టైమ్ లో పవన్ తో కలిసి కాస్త హల్ చల్ చేసాడు. ఆ తరువాత మళ్లీ సైలెంట్…

నిర్మాత బండ్ల గణేష్ సినిమా నిర్మించి కాస్త బాగానే గ్యాప్ వచ్చింది. ఆ మధ్య కాటమరాయుడు టైమ్ లో పవన్ తో కలిసి కాస్త హల్ చల్ చేసాడు. ఆ తరువాత మళ్లీ సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. జై లవకుశ సినిమా చూసి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు అతగాడిని మళ్లీ జనాలకు గుర్తు చేసింది. 

'రాత్రి జై లవకుశ చూసా, నిద్ర పట్టలేదు. ఎస్వీ రంగరావు తరువాత ఆ స్థాయిలో నటించిన మా 'బాద్ షా' కు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు. బాద్ షా టైటిల్ తో బండ్ల గణేష్ ఓ సినిమా ఎన్టీఆర్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వరుస ఫ్లాప్ లకు ఫుల్ స్టాప్ పెట్టి, కెరీర్ టర్నింగ్ ఇచ్చిన టెంపర్ సినిమాను కూడా నిర్మించింది బండ్ల గణేష్ నే. మరి మళ్లీ మరో సినిమా ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నాడేమో?

అయినా ఎన్టీఆర్ ఇప్పుడు ఖాళీ లేడు. హారికహాసినితో, డిస్టిబ్యూటర్ సుధాకర్ తో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. ఆ తరువాత మూడో సినిమా సంగతి. నిర్మాత అశ్వనీదత్ కు కూడా ఓ సినిమా చేసే ఆలోచన వుందని వినికిడి. అందువల్ల బండ్ల గణేష్ పొగిడినా ఇప్పటికి అయితే పెద్దగా ఉపయోగం వుండకపోవచ్చు.