Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బెంగాల్ టైగర్ లో.. తెలుగుదేశం పై పంచ్ లు..!

బెంగాల్ టైగర్ లో.. తెలుగుదేశం పై పంచ్ లు..!

ఫిక్షనల్ గా సాగే సినిమాలో కాంటెంపరరీ ఇష్యూలను ప్రస్తావించడం కొంతమంది దర్శకులకు ఒక సరదా. ఇలాంటి అవకాశాన్ని తీసుకుని వాళ్లు తమ అభిమానాలను కూడా బయటపెట్టుకొంటూ ఉంటారు. ఇప్పుడు దర్శకుడు సంపత్ నంది కూడా అలాంటి అవకాశాన్నే తీసుకున్నాడు. 

బెంగాల్ టైగర్ సినిమాలో ఈ దర్శకుడు పవన్ కల్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కామెడియన్ల చేత చెప్పించిన డైలాగుల్లో పవన్ ను కీర్తించాడు. హీరో కావాలని కలలు కనే ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా పృథ్వి కనిపించే పాత్ర చేత " పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పబట్టే కదా.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో జనాలు ఓట్లు గుద్ది ఒక పార్టీని గెలిపించేశారు..'' అని చెప్పించాడు ఈ సినిమాకు మాటల రచయిత కూడా అయిన సంపత్ నంది. ఈ  విధంగా పవన్ పై తనకున్న అభిమానాన్ని ఎష్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. పవన్ వల్లనే తెలుగుదేశం గెలిచిందన్న విషయాన్ని కూడా పలికించాడు. 

మరి నిఖార్సైన తెలుగుదేశం అభిమానులు ఈ స్టేట్ మెంట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరునుకోండి. అలాగే మరోసారి  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా సీన్లోకి లాగాడు సంపత్ నంది. హీరో ఆవారాగాడు.. అతడికి తన కూతురిని ఇవ్వడం ఎలా? అని హీరోయిన్ తండ్రి ఆలోచనలో ఉండగా.. ఆయన భార్య పాత్ర ఒక డైలాగ్ చెబుతుంది. "ఎదుగుతాడనే నమ్మకం ఉంది కాబట్టే... చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ తన కూతురుని ఇచ్చాడు, చిరంజీవికి అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చాడు..'' అంటూ అలాంటి భరోసానే ఉంచమని ఆమె భర్తకు సలహా ఇస్తుంది! 

కొంచెం ఓవర్ డోస్ కావడంతో ఈ డైలాగును విన్నప్రేక్షకులు  "ఇక చాలు ఆపమ్మో...'' అని థియేటర్లోనే అనేయడం కనిపించింది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?