బాలీవుడ్ లో మరో బ్రేకప్..?

ఎంత ఈజీగా కలిసిపోతారో అంతే ఈజీగా విడిపోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోహీరోయిన్ల మధ్య ఆఫ్-స్క్రీన్ బంధాలు సీజన్ కు ఒకలా మారిపోతున్నాయి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా బంధాల్ని…

ఎంత ఈజీగా కలిసిపోతారో అంతే ఈజీగా విడిపోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోహీరోయిన్ల మధ్య ఆఫ్-స్క్రీన్ బంధాలు సీజన్ కు ఒకలా మారిపోతున్నాయి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా బంధాల్ని మార్చేస్తున్నారు. మొన్నటికి మొన్న రణబీర్-కత్రిన వ్యవహారం చూశాం. ఇప్పుడు తాజాగా అలియా భట్-సిద్దార్థ్ మల్హోత్రా బ్రేకప్ అంటూ వార్తలు వస్తున్నాయి.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కలిసిన ఈ జోడీ అప్పట్నుంచి రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది. ఫ్రెండ్స్ అంటూ పైకి చెప్పుకుంటున్నప్పటికీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. తాజాగా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ ఒకర్నొకరు అస్సలు పలకరించుకోలేదట.

ఇక్కడ కొసమెరుపేంటంటే.. సిద్దార్థ్ కు దూరంగా ఉండడం కోసం సౌత్ లో ఓ సినిమా ఒప్పుకోవాలని ఫిక్స్ అయిందట అలియాభట్. అలా సిద్దార్థ్ కు ఓ 3-4 నెలలు దూరంగా ఉండి, తర్వాత అతడ్ని మరిచిపోవచ్చనేది అలియా ప్లాన్. మరి ఇలాగైనా ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమా ఇండస్ట్రీకి వస్తుందేమో చూడాలి.