బాలీవుడ్‌కి వెళ్తే టాలీవుడ్‌ కన్పిస్తుందా.!

‘ముకుంద’ హీరోయిన్‌ పూజా హెగ్దేకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలొస్తున్నాయి. అల్లు అర్జున్‌, కొరటాల శివ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకి ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యిందట. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’తోనే ఇటు సినీ జనం,…

‘ముకుంద’ హీరోయిన్‌ పూజా హెగ్దేకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలొస్తున్నాయి. అల్లు అర్జున్‌, కొరటాల శివ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకి ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యిందట. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’తోనే ఇటు సినీ జనం, అటు ప్రేక్షకులు.. పూజా హెద్దేకి ఫిదా అయిపోయారు. రెండో సినిమా ‘ముకుంద’తో పూజా హెగ్దేకి మరింత మైలేజ్‌ వచ్చింది.

అయితే, ‘ముకుంద’ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ సరసన ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది పూజా హెగ్దే. ఇంకేముంది, ఒక్కసారి బాలీవుడ్‌కి వెళ్ళాక మళ్ళీ సౌత్‌లో సినిమాలు చేయడం కష్టమే.. అన్న వాదనలు షురూ అయ్యాయి. తమన్నా, కాజల్‌, తాప్సీ, త్రిష తదితరులు బాలీవుడ్‌లో చేసినా, తెలుగు సినిమాలూ మానుకోవడంలేదు.

ఇలియానా మాత్రం బాలీవుడ్‌కి వెళ్ళాక టాలీవుడ్‌ని వదిలేసింది. చాలాకాలం క్రితం అసిన్‌ కూడా బాలీవుడ్‌కి వెళ్ళి, మళ్ళీ దక్షిణాది సినిమాల్లో నటించలేదు. దాంతో, పూజా హెగ్దే కూడా బాలీవుడ్‌కి వెళ్ళాక టాలీవుడ్‌నే కాదు, సౌత్‌ సినిమాల్నే పెద్దగా పట్టించుకోదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పూజా హెగ్దే మాత్రం, తనకు హీరోయిన్‌గా గుర్తింపునిచ్చిన టాలీవుడ్‌ని ఎప్పటికీ మర్చిపోనంటోంది. చూద్దాం.. అసలే టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత.. ఈ దశలో అందమైన హీరోయిన్‌ దొరికింది.. అని అంతా అనుకుంటుండగా, పూజా హెగ్దే బాలీవుడ్‌కి వెళ్ళాక టాలీవుడ్‌ని గుర్తుంచుకుని, తెలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో.!