బొమ్మరిల్లు భాస్కర్ ఎవరికోసం?

బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు గీతా కాంపౌండ్ వున్నారు. ఈ సంగతి తెలిసిందే. ఒంగోలు గిత్త కుమ్ముడుకి ఇప్పటి దాకా మళ్లీ సినిమా లేకుండా పోయింది. భాస్కర్ చెప్పిన లైన్ ఇప్పుడు స్క్రిప్ట్ గా తయారయ్యే…

బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు గీతా కాంపౌండ్ వున్నారు. ఈ సంగతి తెలిసిందే. ఒంగోలు గిత్త కుమ్ముడుకి ఇప్పటి దాకా మళ్లీ సినిమా లేకుండా పోయింది. భాస్కర్ చెప్పిన లైన్ ఇప్పుడు స్క్రిప్ట్ గా తయారయ్యే పనిలోవుంది. అయితే ఇది ఎవరి కోసం? శిరీష్ కోసం అని ఓ గ్యాసిప్ వినిపించింది. కానీ కాదని తెలుస్తోంది. 

వేరే యంగ్ హీరో ఎవరికి సూట్ అవుతుందా అన్న డిస్కషన్ నడుస్తోందట. పైగా ఈ సినిమా గీతా బ్యానర్ లో కాకుండా గీతా 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మాతగా తయారవుతుందట. సాయిధరమ్ హీరోగా ఓ ఆలోచన వచ్చిందట. మరి ఇటీవల బన్నీ-సాయి ధరమ్ ల మధ్య మారిన ఈక్వేషన్ల కారణంగా ఆ ఆలోచన మారుతుందేమో అన్నది చిన్న అనుమానంగా వుంది. మరి ఏ హీరో సెట్ అవుతారో చూడాలి.

ఇదిలా వుంటే సాయి ధరమ్ తేజ తిక్క పరాజయాన్ని పక్కన పెట్టి కృష్ణ వంశీ నక్షత్రం షూటింగ్ కు రేపటి నుంచి హాజరవుతున్నాడు. ఆ సినిమాలో సాయి ధరమ్ 20 నిమషాల సేపు మాత్రమే కనిపిస్తాడు. మెయిన్ హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నాడు.