సెన్సార్ కేరాఫ్ ప్రసాద్ ల్యాబ్

ఆంధ్ర తెలంగాణ సమస్య ఇంకా సమసిపోలేదు. విభజన వ్యవహారాలు పూర్తి కాలేదు. ఇప్పుడు ఇవి ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కూడా రాజుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఇక్కడ సినిమాలు చూసి,…

ఆంధ్ర తెలంగాణ సమస్య ఇంకా సమసిపోలేదు. విభజన వ్యవహారాలు పూర్తి కాలేదు. ఇప్పుడు ఇవి ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కూడా రాజుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఇక్కడ సినిమాలు చూసి, సెన్సారు చేసే వ్యవహారం కాస్తా, ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ కు మారింది. 

అఖిల్ ఇక్కడే చూసి సెన్సార్ చేసారు. ఇప్పుడు ఈ రోజు కుమారి 21 ఎఫ్ కూడా ల్యాబ్ లోనే చూసారు. కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఛాంబర్ లో చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎపి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను రెండుగా విడదీస్తారో లేదా, తెలంగాణకు సెపరేట్ గా ఏర్పాటుచేస్తారో, కాదూ అంటే ఇది తెలంగాణకు వదిలేసి, విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేస్తారో మరి? మొత్తానికి ఏదో జరుగుతోంది..అంతవరకు సెన్సార్ కేరాఫ్ ప్రసాద్ ల్యాబ్.