చరణ్‌ తొందరపెడుతున్నాడట..

ఎవడు సినిమా విడుదల ఇంకా సందిగ్థంలోనే ఉంది. దసరా, దీపావళి… అంటూ పండుగలు వెళ్లిపోతున్నాయిగానీ.. రామ్‌చరణ్‌ సినిమా రావడం లేదు. సినిమాపూర్తయినా…. ఇంకా తమ దగ్గరే అట్టి పెట్టుకోవడం ఎంత రిస్కో దిల్‌ రాజుకీ…

ఎవడు సినిమా విడుదల ఇంకా సందిగ్థంలోనే ఉంది. దసరా, దీపావళి… అంటూ పండుగలు వెళ్లిపోతున్నాయిగానీ.. రామ్‌చరణ్‌ సినిమా రావడం లేదు. సినిమాపూర్తయినా…. ఇంకా తమ దగ్గరే అట్టి పెట్టుకోవడం ఎంత రిస్కో దిల్‌ రాజుకీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఎవడు సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనల్లో ఉన్నారు. 

ఈ విషయంలో రామ్‌చరణ్‌ కూడా నిన్నా మొన్నటి వరకూ కామ్‌ గానే ఉన్నాడు, సినిమాలో నటించడం వరకే నా పని అనుకొన్నాడు.కానీ ఇప్పుడు మాత్రం దిల్‌ రాజుని తొందర పెడుతున్నాడట. సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయమని, ఇక వాయిదాలు వద్దని గట్టిగా చెబుతున్నాడట. దానికీ కారణం ఉంది. తుఫాన్‌ దెబ్బ రామ్‌చరణ్‌ ని గట్టిగానే తాకింది. ఎవడు సినిమా కూడా తుస్సుమంటే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చరణ్‌కి తెలుసు. ఎవడు ఆలస్యం అయ్యే కొద్దీ.. ఈ సినిమాపై నెగిటీవ్‌ ప్రచారం జరుగుతుందని చరణ్‌ భయపడుతున్నాడు. 

మరోవైపు సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర పోటీ ఎక్కువగా ఉండబోతోంది. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, నితిన్‌ సినిమాలు పండక్కే రాబోతున్నాయి. అప్పుడు… ఎవడుకి స్లాట్‌ దొరక్కపోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులూ ఓ కొలిక్కి వస్తున్నాయి, జనవరిలోగా పెద్ద సినిమాలేం కావు కాబట్టి… ఎవడు ని ముందే తీసుకొద్దాం అంటున్నాడట. మరి దిల్‌ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో మరి.?