చరణ్ కు తెలిసే జరిగిందా?

డిజె కలెక్షన్ల రగడ ఆగినట్లే కనిపిస్తోంది కానీ, ఇంకా ఫ్యాన్స్ మధ్య ఫేస్ బుక్ ల్లో గట్రా వాదనలు, కామెంట్లు కంటిన్యూ అవుతూనే వున్నాయి. మెగా ఫ్యామిలీ అన్నా, మెగా హీరోలు అన్నా చిరు,…

డిజె కలెక్షన్ల రగడ ఆగినట్లే కనిపిస్తోంది కానీ, ఇంకా ఫ్యాన్స్ మధ్య ఫేస్ బుక్ ల్లో గట్రా వాదనలు, కామెంట్లు కంటిన్యూ అవుతూనే వున్నాయి. మెగా ఫ్యామిలీ అన్నా, మెగా హీరోలు అన్నా చిరు, పవన్, చరణ్, వరుణ్, సాయిధరమ్ మాత్రమే అనే విధమైన పోస్టులు కూడా చలామణీ అయ్యాయి.

ఇదంతా వంద కోట్ల కలెక్షన్ ప్రచారం తెచ్చిన తంటా. ఈ లెక్కల కోసమే నిర్మాత దిల్ రాజు ఆఫీసు దగ్గరకు మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వెళ్లింది. ఇప్పుడు లేటెస్ట్ డవుట్ ఏమిటంటే, ఈ సంఘటన పూర్వా పరాలు హీరో రామ్ చరణ్ కు తెలిసే వుంటాయన్నది.

ఎందుకంటే ఇలా వెళ్లిన వాళ్లలో సుమారు పది మంది నిత్యం రామ్ చరణ్ కు టచ్ లో వుండే హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ అంట. వాళ్లు రామ్ చరణ్ కు చెప్పకుండా, ఆయన ఊ అనకుండా ఇంత పని చేస్తారా? అన్న అనుమానాలు బన్నీ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.

మరోపక్క మెగా హీరోలు అంటే వీరే అంటూ బన్నీని వేరు చేయడం, సంక్రాంతి బరి నుంచి రామ్ చరణ్ తప్పుకుని, పవర్ స్టార్ కు చోటిస్తున్నారని వార్తలు వినిపించడం వంటివి అన్నీ కలిసి, కొణిదెల ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెంచుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ నడుమ షేర్ అవుతున్న పోస్టులు ఈ విషయాలను దృఢపరుస్తున్నాయి.

ఏది ఏమైనా డిజే సినిమా, దాని కలెక్షన్లపై దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రకటనలు, అన్నీ కలిసి మొత్తానికి మెగా క్యాంప్ ను దిగ్విజయంగా రెండుగా చేసినట్లు కనిపిస్తోంది.