చరణ్, ఎన్టీఆర్ బ్రదర్స్.. బడ్జెట్ 150 కోట్లు

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా సాయిధరమ్ తేజ్ కన్ ఫర్మ్ చేశాడు. ఫొటో చూసిన వెంటనే రామ్ చరణ్ కు…

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా సాయిధరమ్ తేజ్ కన్ ఫర్మ్ చేశాడు. ఫొటో చూసిన వెంటనే రామ్ చరణ్ కు ఫోన్ చేశానని.. “అవును, సినిమా చేస్తున్నా” అని రామ్ చరణ్ చెప్పాడని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే స్టోరీలైన్ ఫిక్స్ చేశాడు. ఆ స్టోరీలైన్ ను చెర్రీ, తారక్ కు రాజమౌళి వివరించాడు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్.

స్టోరీలైన్ పక్కనపెడితే.. ఈ మూవీ బడ్జెట్ మాత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించడం గ్యారెంటీ. అటుఇటుగా ఈ సినిమాకు 150నుంచి 180కోట్ల రూపాయల మధ్య అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి టీం రెమ్యూనరేషన్లకే 80కోట్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్లు, టాప్ టెక్నీషియన్లకు మరో 20కోట్లు వేసుకున్నా.. పారితోషికాలకే అటుఇటుగా వందకోట్లు అవుతుంది. ఇక అక్కడ్నుంచి ప్రొడక్షన్ కాస్ట్ అదనం.

నిజానికి ఈ సినిమాకు బడ్జెట్ ఎంత ఎక్కువైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. రాజమౌళి నెక్ట్స్ సినిమా ఇతడి ఎకౌంట్ లోనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ అంటేనే ఊహకు అందనిది. అలాంటి కాంబినేషన్ కు రాజమౌళి డైరెక్టర్ అంటే ఇక ఆ సినిమాకు వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో బాహుబలి తర్వాత ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కాబోతోంది.