Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి ఫోన్ చేస్తే షాక్

చిరంజీవి ఫోన్ చేస్తే షాక్

బాహుబలి ప్రభాస్ తన లేటెస్ట్ సినిమా సాహో ట్రయిలర్ విడుదల అనంతరం వచ్చిన గొప్ప అనుభవం ఏమిటన్నది వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి, అభినందించి, ప్రశంసలు కురిపించడంతో తనకు గూస్ బంప్స్ వచ్చాయని ఆయన వెల్లడించారు. ట్రయిలర్ విడుదల నేపథ్యంలో ఆయన, తన హీరోయిన్ శ్రద్ద కపూర్, నిర్మాతలు ప్రమోద్, వంశీలతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రయిలర్ మీద అందిన బెస్ట్ ఫ్రశంస ఏమిటి అని ప్రశ్నించగా, మెగాస్టార్ ఫోన్ చేసి అభినందించిన విషయాన్ని వెల్లడించారు.

దర్శకుడు రాజమౌళి స్పందన ఏమిటి? ట్వీట్ కూడా చేయలేదుగా? అని ప్రశ్నించగా, ఆయనకు నచ్చిందని, మెచ్చుకున్నారని ప్రభాస్ తెలిపారు. ట్రయిలర్ ను ఇంతలా కట్ చేయడానికి దర్శకుడు సుజిత్, అతని టీమ్ చాలా కష్టపడ్డారని, బోలెడు కట్ లు చేసి, చేసి ఆఖరిది ఇది పైనల్ చేసారని అన్నారు.

బాహుబలి లో కథ బలంగా వుంటుందని, అందుకే దాని తరువాత అంతకన్నా గొప్ప కథ తేలేము కనుక, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేయాలని సాహో ను ఎంచుకున్నామని వెల్లడించారు. సాహో కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, మాంచి లవ్ స్టోరీ కూడా వుంటుదని ప్రభాస్ అన్నారు.

బాహుబలి తరువాత ఆ సినిమా అభిమానులను, తన అభిమానులను నిరాశ పర్చకుండా మంచి సినిమా అందించగలిగితే చాలని, బాలీవుడ్ బాద్ షా ల్లాంటి ఆలోచనలు లేవని అన్నారు. బాహబలి వన్ విడుదల కాకముందే సాహో సబ్జెక్ట్ ను సుజిత్ చెప్పాడని, అయితే బాహుబలి వరల్డ్ వైడ్ గా విజయం సాధించడంతో సాహో ను కూడా అన్ని ప్రాంతాలకు నప్పేలా తీయాలని ప్లాన్ చేసామన్నారు.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ ల కోసం వేలాది స్కోర్ బోర్డ్ లు వేసారన్నారు. దేశంలో టాప్ టెక్నీషియన్స్, విదేశీ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేసారని ప్రభాస్ అన్నారు. ప్రతిసారీ త్వరగా సినిమాలు చేస్తానని చెప్పడం, చేయలేకపోవడం కాస్త ఇబ్బందిగా వుందని, ఇకపై ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇవ్వనని ప్రభాస్ అన్నారు.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?