Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి- పూరీ.. రాజీ పడ్డారు!

చిరంజీవి- పూరీ.. రాజీ పడ్డారు!

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ లెంగ్త్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే ప్రయత్నాల్లో ఉండగా.. దర్శకుడు పూరీ వ్యవహారం ఒకటి చర్చకు వచ్చింది. చిరంజీవికి తను కథను వివరించాను అని.. అయితే ఆయనకు అది నచ్చలేదని తనతో డైరెక్టుగా చెప్పకుండా మీడియా ద్వారా చెప్పడం బాధించిందని పూరీ చెప్పాడు. ఫస్టాఫ్ నచ్చిందని చెప్పిన చిరు.. సెకెండాఫ్ విషయంలో అభిప్రాయాన్ని సూటిగా చెప్పలేదని... మీడియా ద్వారా ఈ విషయం తెలిసిందని పూరీ వ్యాఖ్యానించాడు. ఈ దర్శకుడు ఇలా మాట్లాడటంతో మెగాఫ్యామిలీ హర్ట్ అయ్యిందని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.

చిరంజీవి గురించి పూరీ మీడియాతో ఇలా మాట్లాడటం మెగాభిమానులను కూడా హర్ట్ చేసింది. ఎలాగోలా చెప్పాడు కదా.. పూరీ మళ్లీ రచ్చ చేయడం ఏమిటి? అంటూ మెగాభిమానులు మండిపడ్డారు. ఆ తర్వాత ఆ విషయాన్ని.. పూరీ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమాను అందరూ మరిచిపోయారు. పూరీ తన సినిమాతో తాను బిజీ అయిపోయాడు.. చిరంజీవి కూడా రీ ఎంట్రీ సినిమాపై ద ష్టి పెట్టారు. అయితే ఇది బయటకు కనిపిస్తున్న వ్యవహారం. అంతర్గతంగా మాత్రం వీరు కథ విషయంలో మళ్లీ కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తోంది.

కేవలం రీఎంట్రీ సినిమాతోనే ఆగక.. మరిన్ని సినిమాలు చేయడానికి మెగాస్టార్ ఆసక్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్పట్లో పూరీ చెప్పిన కథకు పలు మార్పులూ చేర్పులను సూచించాడట మెగాస్టార్. ప్రస్తుతం పూరీ ఆ పని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగూ ఫస్టాఫ్ చిరంజీవికి నచ్చింది.. ఇక ద్వితీయార్థం విషయంలో మార్పు చేర్పులు చేయాల్సి ఉంది.. ఆ పనులను పూర్తి చేసి చిరంజీవిని మెప్పించడానికి పూరీ కసరత్తులు చేసినట్టుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే మెగాస్టార్, పూరీల కాంబినేషన్‌లో సినిమా ఖాయమే! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?