Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్..కెమేరామన్ డిష్కుం..డిష్కుం?

డైరక్టర్..కెమేరామన్ డిష్కుం..డిష్కుం?

వేవ్ లెంగ్త్ కలవకపోతే సమస్యగానే వుంటుంది. విరాటపర్వం  సినిమా విషయంలో  ఇదే జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విరాటపర్వం సినిమాకు దర్శకుడు వేణు ఉడుగుల. రానా-సాయి పల్లవి హీరో హీరోయిన్లు. అయితే సమస్య వీళ్లతో కాదు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి. పేరున్నవాడు..పని వచ్చిన వాడు. మాంచి సినిమాలకు పనిచేసినావాడు. అందుకే ఏరి కోరి మరీ తెచ్చుకున్నారు. 

కానీ ఎందుకో డైరక్టర్ కు ఈయనకు సెట్ కావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈయనను మార్చి తనతో బాగా భావజాలం కుదిరిన రాజు తోట ను తెచ్చుకుందామని చూస్తున్నట్లు బోగట్టా.

రాజు తోట-వేణు ఊడుగుల కలిసి గతంలో ’నీదీ నాదీ ఒకే కథ’  సినిమాకు పనిచేసారు. అదీ సంగతి. అయితే ఈ వ్యవహారం ఇప్పడు నేరుగా హీరో రానా దగ్గరకు చేరిందని, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇలా అబేయన్స్ లో వుంచండి, తాను డిసెంబర్ లో సెట్ మీదకు వచ్చాక డిసైడ్ చేస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి దివాకర్ మణి వర్క్ అంతా వేరుగా వుంటుంది. అందరు డైరక్టర్లకు అతను సెట్ కాడని పేరు. సుధీర్ వర్మ అయితే రెండు సినిమాలకు ఆయనతోనే చేయించుకున్నాడు. మరి వేణు ఊడుగులకు ఎక్కడ తేడా వచ్చిందో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?