Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్ కు మైత్రీ హుకుం?

డైరక్టర్ కు మైత్రీ హుకుం?

డైరక్టర్లకు అడ్వాన్స్ లు ఇవ్వడం మామూలే. సినిమా చేస్తే సరేసరి లేదంటే వసూలు చేసుకొవడం కూడా మామూలే. ఇప్పుడు ఈ పనిమీదే వుంది మైత్రీ మూవీస్ సంస్థ.

డైరక్టర్ పరుశురామ్ బుజ్జికి అడ్వాన్స్ ఇచ్చిందట సినిమా కోసం. కానీ ఇప్పుడు ఆయన తమకు చేయకుండా 14 రీల్స్ సంస్థకు సినిమా చేస్తున్నారని తెలిసి, తమ అడ్వాన్స్ తమకు ఇచ్చేయమని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

2.80 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వుందని, వెంటనే చెల్లించమని పరుశురామ్ ను మైత్రీ మూవీస్ అధినేతలు కోరారని, దాంతో కోటి రూపాయలు వెనక్కు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన మొత్తం కూడా వెంటనే ఇవ్వమని కోరుతున్నట్లు బోగట్టా.

ఇది తెలిసి మరి ఒకరిద్దరు కూడా పరుశురామ్ ను అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వమని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరుశురామ్ 14 రీల్స్ సంస్థకు సినిమా చేయడానికి ఒప్పుకుని నాలుగుకోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ డబ్బులను పాత అడ్వాన్స్ లు రీ పే చేయడానికి వాడతారని అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?