ఎలా.. ఎలా.. ఎవరు మాంటేజ్ మెలోడీ

అడవిశేష్ లేటెస్ట్ సినిమా ఎవరు? పివిపి బ్యానర్ పై తయారైన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు రెడీ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో పాటను ఈరోజు విడుదల చేసారు.…

అడవిశేష్ లేటెస్ట్ సినిమా ఎవరు? పివిపి బ్యానర్ పై తయారైన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు రెడీ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో పాటను ఈరోజు విడుదల చేసారు. 'ఎన్నెన్నో కథలే చూసినా, ఏవేవో కలలే రేగెనా' అంటూ సాగిన ఈ మాంటేజ్ సాంగ్ ను శ్రీచరణ్ మాంచి మెలోడీగా మలిచే ప్రయత్నం చేసారు మ్యూజిక్ డైరక్టర్ శ్రీచరణ్.

స్పానిష్ సినిమా ది ఇన్విజబుల్ గెస్ట్ ఆధారంగా తయారైన ఈ సినిమాకు వెంకట్ రాంజీ దర్శకుడు. స్పానిష్ సినిమా లైన్ తీసుకుని, అడవిశేష్ తనదైన స్టయిల్ లో ట్విస్ట్ లు జోడించి తీసిన సినిమా ఇది. గూఢచారిలో ఎలాగైతే క్లయిమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుందో, ఎవరు సినిమాలో కూడా క్లయిమాక్స్ లో ఎక్స్ టెండెడ్ ట్విస్ట్ వుంటుందని తెలుస్తోంది.

హిందీ సినిమా బద్లా కూడా ఇదే కాన్సెప్ట్ తో తయారైంది. ఆ సినిమాలో తాప్సీ చేసిన క్యారెక్టర్ ను తెలుగులో రెజీనా చేస్తోంది. శర్వానంద్ రణరంగం సినిమాతో పోటీపడుతూ ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!