Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇద్దరు హీరోలతో డైరక్టర్ డ్యాన్స్?

ఇద్దరు హీరోలతో డైరక్టర్ డ్యాన్స్?

డైరక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఈ మధ్య తెగ వినిపిస్తోంది. కేజిఎఫ్ లాంటి భారీ సినిమా డైరక్టర్ గా, తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు చాలా వచ్చాయి. అయితే ఇక్కడ చిన్న గమ్మత్తు. ఇటు ఎన్టీఆర్ తో సినిమా అటు మహేష్ బాబుతో సినిమా అని వినిపిస్తోంది. నిర్మాతలు ఎవరు అన్నది పక్కన పెడితే అసలు ఫస్ట్ తెలుగు సినిమా ఎవరితో చేస్తారు అన్నది ఇంట్రస్టింగ్ విషయం.

ఇక్కడే చిన్న గ్యాసిప్ వినిపిస్తోంది. డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు హీరోలతోనూ 'మీతోనే సినిమా మీతోనే సినిమా' అని అంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇద్దరు హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఈ సంగతి గమనించి, ప్రస్తుతానికి ప్రశాంత్ తో సినిమా అనే ఆలోచన పక్కన పెట్టారని టాక్. త్రివిక్రమ్ తో సినిమా అన్నదానికే ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్న మహేష్ బాబు, ముందుగా ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేయడానికి ఫిక్స్ అయిపోయారని, ఆ సినిమాను కూడా అనిల్ సుంకర్ తో కలిసి మహేష్ బాబు సంస్థ అయిన జి ఎమ్ బి నిర్మిస్తుందని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తయిన తరువాత నాలుగు అయిదునెలలు గ్యాప్ తీసుకుని, ప్రశాంత్ నీల్ సినిమాను అనిల్ సుంకర-జిఎమ్ బి బ్యానర్ లో చేయడం అన్నది పక్కా అని, ఆ తరువాత వంశీ పైడిపల్లి సినిమా అని తెలుస్తోంది.                    

మరి తరువాత అయినా ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ సినిమా చేయడం అన్నది ఇప్పుడే సమాధానం దొరకని ప్రశ్న. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?