ఇప్పుడు ఆ ముగ్గురే ఒక జట్టంట

ఇప్పుడు ఆ ముగ్గురు ఒక జట్టంట.. ఒక కట్టంట. ఇదీ టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస. ఇంతకీ ఎవరా ముగ్గురు? సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, రెజీనా. ఇంతకు ముందు ఈ బ్యాచ్…

ఇప్పుడు ఆ ముగ్గురు ఒక జట్టంట.. ఒక కట్టంట. ఇదీ టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస. ఇంతకీ ఎవరా ముగ్గురు? సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, రెజీనా. ఇంతకు ముందు ఈ బ్యాచ్ లో జనాల జాబితా కాస్త ఎక్కువే వుండేదంట. రకుల్ ప్రీత్ సింగ్, అల్లు శిరీష్ ఇలా చాలా మందితో. 

కానీ ఉన్నట్లుండి వన్ ఫైన్ మార్నింగ్ ఏమయిందో, ఎక్కడ తేడా వచ్చిందో? రకుల్ జట్ పీస్ అనేసిందట సందీప్ తో. అంతే లెండి ప్రారంభంలో అయితే ఆమెకు సందీప్ అవసరం వుండి వుండొచ్చు. ఇప్పుడు అవసరం లేదుకదా?  ఎప్పుడియితే రకుల్ గ్రూప్ వదిలేసిందొ, మిగిలిన వారు కూడా లెఫ్ట్,,.లెఫ్ట్ అన్నారని వినికిడి. 

దీంతో ఇప్పుడు ఈ ముగ్గరు మిత్రులు ఒక వైపు, మిగిలిన వారు మరో వైపు మిగిలారట. అందుకే కృష్ణవంశీ తన నక్షత్రం సినిమాకు సందీప్ హీరో అనుకోవడంతో. రేజీనాను హీరోయిన్, సాయి ధరమ్ ను గెస్ట్ గా ఫిక్స్ కావాల్సి వచ్చిందట.