జాగ్వార్ భయపెడుతోందా?

కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ తొలిసారి నటిస్తున్న సినిమా జాగ్వార్. ఈ సినిమాకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. భయంకరమైన ప్రమోషన్ చేస్తున్నారు. ప్రకటనలు కుమ్మేస్తున్నారు. అయితే ఓ పక్క…

కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ తొలిసారి నటిస్తున్న సినిమా జాగ్వార్. ఈ సినిమాకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. భయంకరమైన ప్రమోషన్ చేస్తున్నారు. ప్రకటనలు కుమ్మేస్తున్నారు. అయితే ఓ పక్క ఆ ప్రమోషన్ కు ఆనందిస్తూనే, మీడియా జనాలు కాస్త జంకుతున్నారట. ఎందుకంటే డబ్బులు అందుతాయా? అందవా అని? దీనికి రీజన్ కూడా వినిపిస్తోంది మీడియా సర్కిళ్లలో. 

జాగ్వార్ సినిమా కు సంబంధించి ఇక్కడి వ్యవహారాలు వైజాగ్ రాజుగారు అనే ఆయన చూస్తున్నారట. గతంలో ఆయన తన కొడుకు ను హీరోగా ప్రమోట్ చేయాలని చూసారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతిపై సదరు కొడుకు నిప్పులు చేరిగాడు కూడా. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు తమని అంటూ. ఆ తరువాత అంతా మామూలైపోయింది. 

అయితే చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఆ సమయంలో మీడియాకు సంబంధించి కొన్ని బాకీలు అలాగే వుండిపోయాయని టాక్. అలాగే ఆ తరువాత పడేసావే అని సినిమా చేసారు. అప్పుడు కూడా కొంత డ్యూ తప్పలేదని వినికిడి.

ఇప్పుడు ఆ రాజుగానే ఈ జాగ్వార్ వ్యవహారాలు చూస్తున్నారట. మరి ఇప్పుడు ఏం చేస్తారో అని మీడియా సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి గౌడ కొడుకు కోసం కోట్లు కుమ్మరించవచ్చు. కానీ ఇక్కడ మధ్యలో పూజారిగా ఈ రాజు గారు వున్నారు. అందువల్ల ప్రకటన పైసలు బకాయి వుండవు కదా? అని సరదాగా డిస్కషన్లు చేసుకుంటున్నారు.