కాజల్ మొహం మీద చెప్పేసిందట?

శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. నిజానికి ఈమె స్థానంలో ఉండాల్సిన హీరోయిన్ కాజల్. ఆమె…

శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. నిజానికి ఈమె స్థానంలో ఉండాల్సిన హీరోయిన్ కాజల్. ఆమె కోసం విశ్వప్రయత్నం చేశాడు వైట్ల.

వైట్లకు కాజల్ అంటే కొంచెం సెంటిమెంట్. ఆమె ఉంటే సినిమా హిట్ అని ఫీలవుతాడు. పైగా ఇది తనకు లైఫ్ అండ్ డెత్ లాంటి సినిమా. అందుకే ఇలాంటి ప్రాజెక్టులో కాజల్ ఉంటే సెంటిమెంట్ గా బాగుంటుందని ఫీలయ్యాడు. కానీ కాజల్ మాత్రం ఈ ప్రాజెక్టు చేయనని వైట్ల మొహం మీదే చెప్పేసిందట.

దీనికి 2కారణాలున్నాయి. వీటిలో ఒకటి రెమ్యూనరేషన్. అమర్-అక్బర్-ఆంటోని సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో లాగించేద్దామని చూస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, కాజల్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇక రెండో రీజన్.. కాజల్-రవితేజ కాంబినేషన్ అస్సలు వర్కవుట్ అవ్వదు. ఈ రెండు యాంగిల్స్ దృష్టిలో పెట్టుకొని నో చెప్పేసిందంట కాజల్.

రవితేజ-కాజల్ కాంబినేషన్ లో గతంలో వీర, సారొచ్చారు సినిమాలొచ్చాయి. మరోవైపు ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నివేత థామస్ ను తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది.