కల్యాణ్ రామ్ చేతికి నాగశౌర్య సినిమా!

ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం సర్వసాధారణం. ఇప్పుడు నాగశౌర్య సినిమా కూడా అలానే కల్యాణ్ రామ్ చేతికి మారింది. నాగశౌర్య హీరోగా ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో…

ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం సర్వసాధారణం. ఇప్పుడు నాగశౌర్య సినిమా కూడా అలానే కల్యాణ్ రామ్ చేతికి మారింది. నాగశౌర్య హీరోగా ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో ఓ సినిమా అనుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. కానీ ఇప్పుడా సినిమాలో హీరోగా కల్యాణ్ రామ్ నటించబోతున్నాడు.

కల్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. హీరోయిన్ తో పాటు మిగతా వివరాలు వచ్చే నెలలో తెలుస్తాయి.

ఈమధ్య కాలంలో చాలా సినిమాల్ని పక్కనపెట్టాడు నాగశౌర్య. భవ్య ప్రసాద్ సినిమాతో పాటు, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కూడా ఓ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. వీటితో పాటు సతీష్ వేగేశ్న సినిమాను కూడా వదులుకున్నాడు. అటు కల్యాణ్ రామ్ కూడా విరించి వర్మ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టును పక్కనపెట్టాడు. ఈ క్రమంలో సతీష్ వేగేశ్న, కల్యాణ్ రామ్ ను కలవడం.. స్టోరీ ఒకే అవ్వడం చకచకా జరిగిపోయాయి.

118 సినిమాతో కల్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చాడు. సో.. వరుస ఫ్లాపులతో ఉన్న నాగశౌర్య కంటే కల్యాణ్ రామ్ అన్ని విధాలుగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే వేగేశ్న రాసుకున్న పూర్తి నిడివి ఫ్యామిలీ కథలో కల్యాణ్ రామ్ కూర్చుంటాడా అనేది కాస్త అనుమానాస్పదం.

వైఎస్ జగన్ సక్సెస్ ఫార్ములా అదే!