Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కంగనా.. తెలుగులో మళ్ళీనా.?

కంగనా.. తెలుగులో మళ్ళీనా.?

బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ తెలుగులో ఇప్పటిదాకా చేసింది ఒకే ఒక్క సినిమా. అదే 'ఏక్‌ నిరంజన్‌'. ప్రభాస్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫలితంతో మళ్ళీ కంగనా టాలీవుడ్‌ వైపు చూడలేదు. 'నేను టాలీవుడ్‌కి సరిపడనేమో..' అంటూ అప్పట్లో కంగనా, నిట్టూర్చింది. అయితేనేం, బాలీవుడ్‌లో కంగనా దూసుకెళ్తోంది. 

చాన్నాళ్ళ తర్వాత కంగనా రనౌత్‌ని మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కంగనా ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ఒకటి తెరెకెక్కించనున్నారట. కంగనా, బాలీవుడ్‌లో ఒకప్పుడు గ్లామరస్‌ హీరోయిన్‌. ఇప్పుడు ఆ బ్రాండ్‌తోపాటు, మంచి నటి.. అన్న గుర్తింపు కూడా తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నటిగా పలు అవార్డుల్నీ కంగనా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కి పెరిగిన స్టార్‌డమ్‌ని దృష్టిలోపెట్టుకుని, ఆమెను తెలుగులోకి తీసుకొచ్చేందుకు స్వయంగా పూరి జగన్నాథ్‌ సన్నాహాలు చేస్తున్నాడన్నది ఆ ఊహాగానాల సారాంశం. 

'జ్యోతిలక్ష్మి' తరహాలో కంగనా రనౌత్‌తో పూరి ఓ సినిమా చేస్తాడట. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చింది పూరి జగన్నాథ్‌ కావడంతో కంగన కూడా 'ఓకే' చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?