Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కరుణాకరన్ తోనే ఫిక్స్

కరుణాకరన్ తోనే ఫిక్స్

దిల్ రాజు-అనిల్ రావిపూడి సినిమా చేట్టెక్కేయడంతో హీరో రామ్ మళ్లీ తన స్వంత బ్యానర్ తోనే ఫిక్సయిపోతున్నాడు. హిట్ ల కన్నా, ఫెయిల్యూర్ లు ఖాతాలో దండిగా వున్న డైరక్టర్ కరుణాకరన్ తో తన తరువాతి సినిమా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా చక్కర్లు కొడుతోంది. 

అయితే ఎప్పుడైతే దిల్ రాజు సినిమా ఆగిపోయిందో, ఇప్పుడు దీని మీద రామ్ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం రామ్ చేస్తున్న హైపర్ సినిమా ఫినిష్ అయిపోయింది. ఈ మంథ్ ఎండ్ లో విడుదలకు రెడీ అయిపోతోంది. రామ్ కు వున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే, ప్రాజెక్టు సెట్ అయితే చాలు, చకచకా ఫినిష్ చేసేయాలని చూస్తాడు. అందుకే ఇప్పుడు స్రవంతి బ్యానర్ పై కరుణాకరున్ తో సినిమాను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?