Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కథ కావాలి..బాబూ..కథ కావాలి

కథ కావాలి..బాబూ..కథ కావాలి

సైరా సినిమాతో టాప్ లీగ్ డైరక్టర్ల జాబితాలో చేరిపోయారు దర్శకుడు సుదర్శన్ రెడ్డి. తరువాత సినిమా ఏమిటి అన్నది సినిమా అభిమానుల క్వశ్చను. ప్రభాస్ రెడీగా వున్నారు. ప్రస్తుతం చేతిలో వున్న సినిమా ఫినిష్ చేయగానే చేయడానికి. కానీ కథ కావాలి. అలాగే బన్నీ కూడా చేయడానికి రెడీ. కానీ మళ్లీ అదే సమస్య కథ కావాలి.

సురేందర్ రెడ్డి కూడా వివి వినాయక్ మాదిరే. ఎవరైనా కథ తెస్తే, దాన్ని సినిమాకు అనుగుణంగా మారుస్తారు తప్ప, స్వంతగా కథ చేయడం అన్నది అరుదు. అందుకే ఆయన ప్రస్తుతం కథల కోసం వేటాడుతున్నట్లు బోగట్టా.

దిల్ రాజు దగ్గర ప్రభాస్ డేట్ లు వున్నాయి. అందువల్ల తరువాత సినిమా ఆయన బ్యానర్ లోనే, ఆ హీరోతోనే అన్నది పక్కా. కానీ కథ కావాలి. అటు దిల్ రాజు, ఇటు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఆ వేటలోనే వున్నారు. 

ప్రభాస్ జాను సినిమా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫినిష్ అయ్యేలోగా సురేందర్ రెడ్డి తన స్క్రిప్ట్ తో రెడీ కావాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?