కియరా అద్వానీ ఆ హీరోతో ప్రేమలో!

భరత్ అనే నేను సినిమాలో నటించక మునుపే బాలీవుడ్‌లో ఫేమస్ అయిన కియరా అద్వానీ ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్‌తో ఫేమ్‌ను పొందిన ఈ హీరోయిన్‌కు ఇప్పుడిప్పుడు అవకాశాలు…

భరత్ అనే నేను సినిమాలో నటించక మునుపే బాలీవుడ్‌లో ఫేమస్ అయిన కియరా అద్వానీ ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్‌తో ఫేమ్‌ను పొందిన ఈ హీరోయిన్‌కు ఇప్పుడిప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. భరత్ అనే నేనుతో దక్షిణాదిన మంచి గుర్తింపు దక్కగా, లస్ట్ స్టోరీస్‌తో కియరా సంచలనం రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ హీరోయిన్ ఒక బాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

అతడు మరెవరో కాదు.. సిద్ధార్థ్ మల్హోత్రా. ఇతడికి మొన్నటి వరకూ ఒక ప్రేమబంధం ఉండేది. అది అలియాభట్‌తో. అయితే ఇప్పుడు అలియా రణ్‌బీర్‌తో బంధం మొదలుపెట్టిందని అధికారిక ధ్రువీకరణ అయ్యింది. కొన్నాళ్ల కిందట సిద్ధార్థ్, అలియాలు విడిపోయారని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆ తర్వాత ఈ హీరో శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్‌తో ప్రేమ వ్యవహారాన్ని నడిపించినట్టుగా బాలీవుడ్ జనాలు చెప్పుకున్నారు.

అయితే ఇంతలో ఈ మధ్య కియరా, సిద్ధార్థ్‌లు తరచూ కలిసి కనిపిస్తున్నారు. తాజాగా కియరా పుట్టినరోజు సందర్భంగా కూడా సిద్ధూ వచ్చాడు. అంతకు ముందు కియరా ఇంటి వద్ద సిద్ధార్థ్ పలుమార్లు తచ్చాడుతూ మీడియా కంటపడ్డాడు. దీంతో వీరిద్దరిమధ్య ఎఫైర్ అనే గాసిప్ గుప్పుమంటోంది. ఈ ప్రేమకథ ఎందాకా వెళ్తుందో చూడాలి!