కోన వెంకట్ జోరుమీదున్నారు

శంకరాభరణం డిజాస్టర్ తరువాత కోన వెంకట్ టాలీవుడ్ నుంచి ఒక్కసారి అమెరికాకు వెళ్లిపోయారు. కొన్నాళ్లు అక్కడుండి, మొత్తం వ్యవహారాలు సెట్, రీసెట్ చేసుకుని వచ్చేసారు. కోన అవుట్ అనుకున్నవారికి తన స్టయిల్ లో సమాధానం…

శంకరాభరణం డిజాస్టర్ తరువాత కోన వెంకట్ టాలీవుడ్ నుంచి ఒక్కసారి అమెరికాకు వెళ్లిపోయారు. కొన్నాళ్లు అక్కడుండి, మొత్తం వ్యవహారాలు సెట్, రీసెట్ చేసుకుని వచ్చేసారు. కోన అవుట్ అనుకున్నవారికి తన స్టయిల్ లో సమాధానం చెప్పాలని డిసైడ్ అయినట్లుంది. అయితే రచయితగా మాత్రం కాదు. నిర్మాణాలు, ప్రాజెక్టుల్లో ఆయన దూసుకుపోతున్నారు. 

ముందుగా నాగ్ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో అంటూ ఓ ప్రాజెక్టు విడుదలకు రెడీగా వుంది. ప్రభుదేవా, తమన్నాలతో అభినేత్రి ప్రాజెక్టును తెలుగుకు ఎమ్ వి వి సత్యనారాయణ తో సెట్ చేయించేసారు. ఆపై మళ్లీ ప్రభుదేవా దే మరో ప్రాజెక్టును కూ డా తెలుగుకు తీసుకునే ప్రయత్నంలో వున్నారట. ఇవి కాక ఇంకా రెండు మూడు ప్రాజెక్టులను సెట్ చేసే పనిలో వున్నారట. 

మొత్తానికి మూడు నాలుగు నెలల గ్యాప్ లో బోలెడు మంచి ఇన్వెస్టర్లను పట్టేసారు కొన వెంకట్. కానీ సాహసం శ్వాసగా నిర్మాతే పాపం, సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని గౌతమ్ మీనన్ కేసి చూస్తున్నారు.