Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు.. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా!

చిరు.. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా!

మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ని ప్లాన్ చేసినపుడు, దాన్ని అన్ని విధాలా ప్రమోట్ చేయడానికి తలపెట్టిన కార్యక్రమాల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు ఒకటి. మాటీవీలో హీరో నాగార్జున సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చిరు తన చేతిలోకి తీసుకున్నారు. తన మిత్రుడు, వ్యాపార భాగస్వామి కోసం నాగ్ త్యాగం చేసారు. ఆ తరువాత ఎమ్ ఇ కే కోసం పలు ప్రోమోలు కూడా తయారుచేసారు. మాటీవీలో ప్రసారం చేసారు. కానీ జనాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. నాగ్ ను చూసిన కళ్లతో చిరు ప్రోగ్రామ్ ను చూడలేమనుకున్నారో ఏమో? ఈ కార్యక్రమం ఇదిగో స్టార్ట్ అవుతుంది..అదిగో స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఏకంగా మరిచిపోయారు. నవంబర్, డిసెంబర్ అయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కానీ ప్రోగ్రామ్ జాడలేదు.

దీనికి కారణం మెగాస్టార్ ప్లాన్ మారడమే అని తెలుస్తోంది. ఎమ్ ఇ కే వల్ల తన సినిమాకు బజ్ రాకపోగా, ప్రోగ్రామ్ తేడా చేస్తే, అనవసరపు సమస్యలు అని, దాన్ని పక్కన పెట్టినట్లు వినికిడి. అదే కనుక ఖైదీ విడుదల తరువాత అయితే ఈ హిట్ ఫ్రభావం దాని మీద పడి, ఎమ్ ఇ కె కూడా హిట్ అవుతుందని చెప్పి, తాత్కాలికంగా ఎమ్ ఇ కే ను పక్కన పెట్టించారని తెలుస్తోంది. స్టార్ కు అమ్మేసినా మాటీవీ మీద మెగా, నాగ్ మాటే చెల్లుబాటు అవుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?