Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కర్నూలు వెన్యూ ఫిక్స్? మరి డేట్?

కర్నూలు వెన్యూ ఫిక్స్? మరి డేట్?

మెగాస్టార్ మెగా మూవీ సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కర్నూలు పట్టణాన్ని వేదికగా డిసైడ్ చేసారు. లక్ష మందికి పైగా పట్టే మైదానంలో ఈ సభను నిర్వహించబోతున్నారు. అయితే అంతకు మించి కార్యక్రమం ఫిక్స్ కాలేదు. ఇదే సభలో ట్రయిలర్ కూడా విడుదల చేయాలా? వద్దా? అన్నది డిస్కషన్ ఇంకా వుండనే వుంది. ట్రయిలర్ 15లోగా రెడీ అవుతుందా? అన్నదే డిస్కషన్ కు కారణం. అందుకే డేట్ ఇప్పటికి ఫిక్స్ చేయలేదు. 15 నుంచి 20 లోగా ఏదో ఒక డేట్ వుండే అవకాశం వుంది. 

అలాగే ఎవర్ని అయినా చీఫ్ గెస్ట్ గా పిలవాలా? వద్దా? అన్నది మరో మీమాంస. చిరంజీవి సినిమా కాబట్టి, ఇండస్ట్రీలో ఇంకెవర్ని చీఫ్ గెస్ట్ గా పిలవడం సబబుగా వుంటుంది? అన్నది ఓ పాయింట్. బయటవారిని ఎవర్ని అయినా పిలవాలి అంటే, కర్నూలు లాంటి ప్లేస్ కు తీసుకెళ్లడం అన్నది మరో సమస్య. అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకువస్తే సరిపోతుంది అనే ఆలోచన కూడా వుంది. రామ్ చరణ్ ఎలాగూ వుంటారు. బోలెడు మంది తారాగణం వుంటారు. అందువల్ల ఇక ప్రత్యేక ఆకర్షణ అంటూ అవసరం లేదు. 

ఇదిలా వుంటే కర్నూలులో ఒక సభ చేయడం సబబుగానే వుంటుంది. ఎందుకంటే సీమకు చెందిన స్వాతంత్ర్య వీరుడి కథ కాబట్టి అక్కడ సభ చేయడం వరకు ఓకె. మరి మరో సభ ఇటు తెలంగాణలో చేయాలా? వద్దా? అన్నది కూడా డిస్కషన్ లోనే వుంది. అయితే హైదరాబాద్ లో ఫంక్షన్ లు రొటీన్ అయినందున, బెంగుళూరులో చేయాలన్నది రామ్ చరణ్, మెగాస్టార్ ల ఐఢియాగా తెలుస్తోంది. బెంగుళూరులో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు జరగనంత భారీగా సభ నిర్వహించాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద సైరా ప్రీ రిలీజ్ హడావుడి స్టార్ట్ అయిందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?