లవకుశ ప్రోగ్రెస్ పై అనుమానాలు?

జై లవకుశ సినిమా విడుదల మూడు వారాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ జయ్, లవ, కుశ గా మూడు క్యారెక్టర్లు చేస్తున్న ఈ సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్ బాబీ డైరక్టర్. అయితే సినిమా విడుదల…

జై లవకుశ సినిమా విడుదల మూడు వారాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ జయ్, లవ, కుశ గా మూడు క్యారెక్టర్లు చేస్తున్న ఈ సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్ బాబీ డైరక్టర్. అయితే సినిమా విడుదల మూడు వారాల్లోకి వచ్చేసినా, పనులు మాత్రం ఎక్కడివి అక్కడే వున్నట్లు ఇండస్ట్రీ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల డేట్ మారకూడదనే పట్టుదలతో పనులు చేస్తున్నారట.

సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు ధరిస్తుండడంతో విఎఫ్ఎక్స్ పనులు కాస్త ఎక్కువే వున్నాయని వినికిడి. అయితే సాధారణంగా క్వాలిటీ బాగా కావాలంటే, ఇలాంటి పనులకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వుంటుంది. బాహుబలి, స్పైడర్ సినిమాలకు చేసింది, చేస్తున్నది అదే. కానీ అంత సమయం లేదని, హైదరాబాద్ కు చెందిన కంపెనీల చేతే చకచకా ఏదో విధంగా పనులు కానిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

మరోపక్క ఇప్పటికి ఈ గ్రాఫిక్స్ సంబంధించిన ఒక్క సీన్ కూడా డిఐ వర్క్ కు రాలేదని కూడా టాక్ వినిపిస్తోంది. మరి అవన్నీ ఎప్పుడు రెడీ అవుతాయో? ఎప్పుడ డిఐ చేస్తారో అన్న క్వశ్చన్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో ఈ గుసగుసలు వినిపిస్తున్నాయని లవకుశ యూనిట్ కూ తెలిసినట్లుంది. 10న ట్రయిలర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతే కాదు, సెప్టెంబర్ 3న పాటలు నేరుగా ఆన్ లైన్ లో, మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాటలు, ట్రయిలర్ సంగతి ఎలా వున్నా, సినిమా మాత్రం 21న విడుదల అంటే కనీసం 16వ తేదీ వేళకు రెడీ అయిపోవాలి. అప్పుడు కానీ సెన్సారు, ఓవర్ సీస్ అప్ లోడ్ వంటి పనులకు సమయం చిక్కదు. మరి ఈ 16 రోజుల్లోగా ఈ పనులు అన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.