Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లోకేష్ కు సాకు దొరికింది

లోకేష్ కు సాకు దొరికింది

చంద్రబాబు జైలులోకి వెళ్లిన మర్నాటి నుంచి లోకేష్ ఆంధ్రకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఆయన అనుకూల మీడియా ఈ విషయాన్ని తెలివిగా పట్టించుకోకుండా వదిలేసింది, అరెస్ట్ కు భయపడే ఢిల్లీలో వుండిపోయారని, అంతకు మించిన రాచకార్యాలు ఏవీ అక్కడ లేవనీ సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. 

పైకి మాట్లాడకున్నా, పార్టీ జనాలు కూడా తమ యువగళ తేజం, తమ చిరుత అరెస్ట్ కు భయపడే ఢిల్లీలో దాక్కున్నారనే వాస్తవాన్ని వాళ్లలో వాళ్లే చెవులు కొరుక్కుంటూ ముచ్చటించుకుంటున్నారు. ఇదిగో వస్తారు.. అదిగో వస్తారు అని అనడమే తప్ప లోకేష్ రాజమండ్రిలో అడుగు పెట్టడం కనిపించడం లేదు. 

తండ్రి జైలులో వున్నారు. తల్లి రాజమండ్రిలో ఒంటరిగా బాధపడతున్నారు. ఓదార్చే మరో కొడుకు అంటూ ఎవరూ లేరు. అయినా లోకేష్ ఢిల్లీ నుంచి కాలు కదపడం లేదు. అలా అక్కడ వుండేందుకు కారణం ఇదీ అని చెప్పే సాకు దొరకడం లేదు ఎల్లో మీడియాకు.

కానీ ఇప్పటికి దొరికింది ఓ సాకు. చంద్రబాబు కేసు క్వాష్, బెయిల్ వ్యవహరాలు ఆంధ్రలో ముగిసాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఇదిగో దొరికింది సాకు. ఇదిగో ఈ పని మీదే లోకేష్ ఢిల్లీలో వున్నారు. అందరితో మంతనాలు సాగిస్తున్నారు. చక్రాలు తిప్పుతున్నారు. లేదూ అంటే రాజమండ్రీ లోనే వండేవారు అనే రీతిలో ఇప్పుడు ఎల్లో మీడియా కథనాలు వండి వారుస్తోంది.

కానీ సమస్య ఏమిటంటే 2000 ముందు ఇలాంటివి నడిచాయి. చెల్లాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బలంగా వుంది. లోకేష్ ఢిల్లీలో ఎందుకు వుండిపోయారో అది కోడై కూస్తోంది. అయినా ఇంకా నమ్మంచాలని, బుకాయించాలని కిందా మీదా అవుతోంది ఎల్లో మీడియా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?