Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ బాబు హీరోయిన్ పై ఒకటే పుకార్లు

మహేష్ బాబు హీరోయిన్ పై ఒకటే పుకార్లు

తెలుగులో ఇప్పటివరకు ఆమె చేసింది ఒకే ఒక్క సినిమా. కానీ ఆ సినిమా హిట్ అయినప్పట్నుంచి కైరా అద్వానీపై వరుసగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో 2 క్రేజీ ప్రాజెక్టుల్లో కైరాను ఫిక్స్ చేసినట్టు గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇక్కడ క్రేజీ పాయింట్ ఏంటంటే.. ప్రాజెక్టు కూడా సెట్ అవ్వకముందే కైరా పేరు బయటకు రావడం.

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా. ప్రాజెక్టు అయితే సెట్ అయింది. కథ మాత్రం సెట్ కాలేదు. అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా రాలేదు. అంతలోనే ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ అంటూ వరుసగా కథనాలు వెలుపడ్డాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఓ క్రేజీ ప్రాజెక్టు విషయంలో హీరోయిన్ కు ఇంత ప్రాధాన్యత కనిపించలేదు. ప్రాజెక్టు సెట్ అయిన తర్వాత మెల్లగా హీరోయిన్ పేరు బయటపెట్టేవారు. కానీ కైరా విషయంలో మాత్రం కాస్త అత్యుత్సాహం కనిపిస్తోంది.

సుకుమార్-మహేష్ సినిమా విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా అంటే కనీసం అన్-అఫీషియల్ గా లాక్ అయింది. రేపోమాపో స్టార్ట్ అవుతుంది. కానీ  సుక్కూ-మహేష్ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కైరా అద్వానీ అంటూ మళ్లీ కథనాలు మొదలయ్యాయి.

ఇప్పుడు వీటికి తోడు చిరంజీవి-కొరటాల సినిమా కూడా కైరా పుకార్ల లిస్ట్ లోకి చేరిపోయింది. సైరా తర్వాత కొరటాల డైరక్షన్ లో చిరు చేయబోయే సినిమాలో కైరాను తీసుకోబోతున్నారంటూ మరో కథనం. భరత్ అనే నేను సినిమాతో కైరాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొరటాల, తన నెక్ట్స్ మూవీకి కూడా ఆమెనే రిపీట్ చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది.

ఇలా కైరా చుట్టూ ఇప్పుడు చాలా ప్రచారం నడుస్తోంది. రామ్ చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామ కూడా హిట్ అయితే, ఈ అమ్మడిపై పుకార్లు మరిన్ని పెరగడం ఖాయం. 

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?