Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పుకార్లపై రాజమౌళి ఏమంటాడో?

పుకార్లపై రాజమౌళి ఏమంటాడో?

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మరికాసేపట్లో లాంఛ్ కాబోతోంది. తారక్, చెర్రీ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు అందరి చూపు దీనిపైనే ఉంది. ఈ ప్రాజెక్టుపై ఇన్నాళ్లూ వినిపిస్తున్న పుకార్లకు ఈరోజు తెరపడుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఆ దిశగా ప్రయత్నం చేస్తారా?

ఉదయం సరిగ్గా 11 గంటలకు తారక్-చరణ్ మల్టీస్టారర్ ప్రారంభం అవుతుంది. ప్రభాస్ ఈ ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథిగా వస్తాడంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. తన సినిమా ప్రారంభం రోజునే స్టోరీలైన్ ను కాస్త బయటపెట్టడం రాజమౌళికి అలవాటు. గతంలో ఈగ, మర్యాదరామన్న, బాహుబలి సినిమాల విషయంలో ఇలానే వ్యవహరించాడు జక్కన్న. మరి ఈ మల్టీస్టారర్ విషయంలో రాజమౌళి ఆ పనిచేస్తాడా..? ఈ రోజు స్టోరీలైన్ వెల్లడిస్తాడా..?

మరోవైపు ఈ సినిమా చరణ్, తారక్ పాత్రలపై కూడా చాలా గాసిప్స్ నడుస్తున్నారు. ఇద్దరూ అన్నదమ్ములుగా నటించబోతున్నారంటూ ఓసారి, ఇద్దరూ పోలీస్ పాత్రల్లో కనిపిస్తారంటూ ఇంకోసారి, ఒకరిది హీరో పాత్ర వేరొకరిది నెగెటి షేడ్ అంటూ మరోసారి ఇలా రోజుకో ప్రచారం నడుస్తోంది. హీరోల పాత్రలపై రాజమౌళి క్లారిటీ ఇస్తాడా..?

వీటితో పాటు సినిమా టైటిల్ పై కూడా చాలా కథనాలు వచ్చాయి. ఆ టైటిల్ ను ఈరోజు ప్రకటిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. కాకపోతే హీరోయిన్లపై రాజమౌళి ఓ చిన్నపాటి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇలా ఈరోజు లాంఛ్ కాబోతున్న ఈ మల్టీస్టారర్ పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో పుకార్లు ఉన్నాయి.

వీటిపై ఈరోజు రాజమౌళి ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేదంటే మరికొన్ని రోజుల పాటు ఈ పుకార్లు ఇలా కొనసాగుతుంటాయంతే.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?