Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

సైలెంట్ గా మొదలైన మహాసముద్రం

సైలెంట్ గా మొదలైన మహాసముద్రం

నాగచైతన్య హీరోగా ఈ సినిమా వస్తుందని అంతా భావించారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు రవితేజ చేతికి మారింది. ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి చేయబోతున్న ఈ ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసింది ఇంతవరకు మాత్రమే. కానీ చాలామందికి తెలియని మేటర్ ఏంటంటే.. ఈ సినిమా వర్క్ ఆల్రెడీ మొదలైంది.

మహాసముద్రం సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, ఈ మూవీ కోసం ఇప్పటికే 2 పాటలు కంపోజ్ చేసిపెట్టాడు. ఆ ట్యూన్స్ ను రవితేజ కూడా ఓకే చేశాడు. మరోవైపు హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాడు దర్శకుడు.

ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా పూర్తయ్యేనాటికి పాటలు, స్క్రీన్ ప్లేతో సిద్ధంగా ఉండాలని రవితేజ సూచించాడు. డిస్కోరాజా పూర్తయిన వెంటనే నేరుగా సెట్స్ పైకి వెళ్దామని హామీ ఇచ్చాడు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా సినిమా వర్క్ మొదలుపెట్టారు.

మరోవైపు ఈ ప్రాజెక్టును ఎవరి చేతిలో పెడదామనే అంశంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే జెమినీ కిరణ్ ఫిక్స్ అయ్యారు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇతడితో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామిగా చేరే అవకాశం ఉంది. 

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?