ఉరకలేస్తున్న మహేష్‌ ఫాన్స్‌

‘ఎవడు’ సంక్రాంతి బరిలోంచి తప్పుకున్నట్టు బలమైన సంకేతాలు అందుతూ ఉండడంతో, ఈసారి సంక్రాంతికి ఏకైక భారీ చిత్రం మహేష్‌బాబు ‘1’ అవుతుందని, పోటీ లేకుండా మంచి సీజన్‌లో వచ్చి మహేష్‌ రికార్డులన్నీ కొల్లగొడతాడని అభిమానులు…

‘ఎవడు’ సంక్రాంతి బరిలోంచి తప్పుకున్నట్టు బలమైన సంకేతాలు అందుతూ ఉండడంతో, ఈసారి సంక్రాంతికి ఏకైక భారీ చిత్రం మహేష్‌బాబు ‘1’ అవుతుందని, పోటీ లేకుండా మంచి సీజన్‌లో వచ్చి మహేష్‌ రికార్డులన్నీ కొల్లగొడతాడని అభిమానులు ఇప్పట్నుంచే ఉరకలు వేస్తున్నారు. మరో యాభై రోజుల్లో సూపర్‌స్టార్‌ రాబోతున్నాడంటూ సందడి చేస్తున్నారు. 

‘ఎవడు’ సంక్రాంతికి వస్తుందనే వార్తలని ఖండించిన దిల్‌ రాజు డిసెంబర్‌ 19నే తన సినిమా విడుదల కానుందని మళ్లీ ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్స్‌కి కూడా అదే తేదీకి థియేటర్లు బుక్‌ చేసుకోమని దిల్‌ రాజు చెప్పాడట. ఆల్రెడీ డిసెంబర్‌ 19కి ఎవడుకోసం కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు బుక్‌ అయ్యాయి. 

గత ఏడాది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి కూడా దిల్‌ రాజు ఇలాగే చేశాడు. డిసెంబర్‌ 21కి థియేటర్లు బ్లాక్‌ చేయించి తర్వాత సంక్రాంతికి మార్చాడు. ‘ఎవడు’ ఎప్పట్నుంచో రిలీజ్‌కి రెడీగా ఉంది కాబట్టి ఈసారి డిసెంబర్‌ 19నే విడుదల చేస్తాడో లేక ఏదోటి చెప్పి మళ్లీ వాయిదా వేస్తాడో తెలీదు కానీ ప్రస్తుతానికి పొంగల్‌ రిలీజ్‌ 1 హంగామా అయితే మొదలైపోయింది.