Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఫ్యాన్స్ కు కలవరం

మహేష్ ఫ్యాన్స్ కు కలవరం

తమ అభిమాన హీరోకి మాంచి డైరక్టర్ కాంబినేషన్ దొరికింది అంటే అభిమానులు చాలా సంబరపడతారు. కానీ మహేష్ బాబు అభిమానులు అలా అనుకోవడం లేదట. టైమ్ వేస్ట్ అవుతుందేమో అని కిందా మీదా అవుతున్నారట.

హీరో మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా సక్సెస్ ఎంజాయ్ మెంట్ లో వున్నారు. దీని తరువాత వంశీ పైడిపల్లి సినిమా వుంది. అది మంచి సబ్జెక్ట్. మంచి డైరక్టర్. దిల్ రాజు బ్యానర్. అందువల్ల సమస్య లేదు.

ఆ తరువాతనే మైత్రీ మూవీస్ తో సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నానని ప్రకటించారు. నిజానికి మంచి బ్యానర్. మంచి డైరక్టర్. కానీ ప్యాన్స్ కలవరం అందుకు కాదట. ఈ ఏడాది చివరికో, లేదా ఫిబ్రవరి నాటికో వంశీ పైడిపల్లి సినిమా రెడీ అయిపోతుంది. కానీ సుకుమార్ సినిమా అంటే కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు చెక్కుతారు. అంటే ఏ 2020లోనో సుకుమార్ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ మధ్యలో మహేష్ సినిమానే వుండదు.

అదే పారలల్ గానో, ముందుగానో మరో సినిమా ఏదైనా చేస్తే బాగుండును అనే సలహాలు ఫ్యాన్స్ వాట్సప్ గ్రూప్ ల్లో కనిపిస్తున్నాయట. ఇంతకు ముందు ప్లాన్ ప్రకారం అయితే వంశీ పైడిపల్లి తరువాత త్రివిక్రమ్ సినిమా లేదా, అర్జున్ రెడ్డి డైరక్టర్ సినిమా వుండాలి. కానీ సుకుమార్ కోసం ఆ రెండూ వదిలేసినట్లున్నాడు మహేష్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?