Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ హీరోయిన్..ఇప్పట్లో కాదు?

మహేష్ హీరోయిన్..ఇప్పట్లో కాదు?

పరుశురామ్-మహేష్ బాబులతో మైత్రీ మూవీస్, 14 రీల్స్ కలిపి నిర్మించే సర్కారువారి పాట సినిమా హీరోయిన్ ఎవరు? అన్నది తరచు వినిపిస్తున్న ప్రశ్న. కియారా అద్వానీ అన్నది వెంటనే వినిపించే ఆన్సరు. పూజా హెగ్డే మరో ఆప్షను అన్నది ఇంకో ఆన్సరు. అయితే ఇది ఇప్పట్లో తేలే విషయం కాదని తెలుస్తోంది. విషయం ఏమిటంటే, ఎవరిని అడగాలన్నా? ఎప్పటి నుంచి షూటింగ్? ఎప్పుడు డేట్ లు కావాలి? అన్న ప్రశ్నలు ముందుగా వస్తాయి.

ఆ విషయంలో సర్కారువారి పాట సినిమాకే కాదు, చాలా సినిమాలకు క్లారిటీ లేదు. కారణం కరోనా వ్యవహారం ఎలా ముందుకు సాగుతుందో? ఎలా ముగియనుందో తెలియదు.  బాలీవుడ్ లో కియారా సినిమాలు మూడు నాలుగు లైన్లో వున్నాయి. వాటిని ఫినిష్ చేసి, మహేష్ సినిమాకు డేట్ లు ఇవ్వాలి. ఇక్కడ డేట్ లు, అక్కడ డేట్ లు మ్యాచ్ కావాలి.

ఇక పూజా హెగ్డే, అలాగే కీర్తి సురేష్ ఇలా లైన్లో పేర్లు చాలా వున్నాయి. కానీ వాళ్లతో కూడా ఇదే సమస్య. హీరోయిన్లు అనేసరికి వేరే భాషల్లో నటిస్తారు. అన్ని డేట్ లు సింక్ కావాలి. 

ఇలాంటి టైమ్ లో సాయి మంజ్రేకర్ పేరు కూడా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ తో బాక్సర్ సినిమా చేస్తున్న ఈ బాలీవుడ్ హీరోయిన్ తో ఇప్పటికే నమ్రత ఓ రౌండ్ డిస్కషన్లు చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతానికి అన్నీ పెండింగ్ నే. షూటింగ్ పక్కాగా ఎప్పటి నుంచి అన్నదాన్ని బట్టి హీరోయిన్ డిసైడ్ అవుతుందని బోగట్టా.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?