Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎట్టకేలకు పరశురాం సాధించాడు?

ఎట్టకేలకు పరశురాం సాధించాడు?

గీతగోవిందంతో అతిపెద్ద సక్సెస్ అందుకున్నాడు పరశురాం. ఆ మూవీ తర్వాత స్టార్ హీరోలంతా తనకు ఎగబడి ఆఫర్లు ఇస్తారని ఆశించాడు. కానీ అలాంటిదేం జరగలేదు. చివరికి క్లోజ్ ఫ్రెండ్ బన్నీ కూడా చూద్దాంలే అన్నాడు తప్ప సినిమా చేద్దాం అని మాత్రం అనలేదు. అలా స్టార్ హీరోల కోసం పరితపిస్తున్న పరశురామ్ కు ఎట్టకేలకు ఓ బడా ఛాన్స్ వచ్చింది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సినిమా వస్తుంది. అల్లు అరవింద్ రిఫరెన్స్ తో మహేష్ ను కలిసిన పరశురాం, ఓ మంచి లైన్ ను మహేష్ కు వినిపించాడట. స్టోరీలైన్ నచ్చిందని, పూర్తిస్థాయిలో డెవలప్ చేయమని మహేష్ సూచించాడట. దీంతో పరశురాం ఆనందానికి అవధుల్లేవ్.

కానీ పరశురాంకు అసలైన పరీక్ష ముందుంది. మహేష్ కు కంప్లీట్ నెరేషన్ నచ్చాలి. సీన్ బై సీన్ చెప్పి మెప్పించాలి. అప్పుడే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. నెరేషన్ నచ్చక సుకుమార్ లాంటి దర్శకుడ్నే పక్కనపెట్టేశాడు మహేష్. కాబట్టి పరశురామ్ కు నో చెప్పడం మహేష్ కు పెద్ద పనికాదు.

ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. సో.. పరశురామ్ కు చాలా టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో మంచి నెరేషన్ తో మహేష్ ను ఒప్పించాల్సి ఉంటుంది. సినిమా ఓకే అయితే గీతాఆర్ట్స్ బ్యానర్ పై ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది. 

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?