మహేష్ కు అయిదు కోట్ల అదనపు లాభం

శ్రీమంతుడు సినిమాతో ప్రాజెక్టులో పార్టనర్ గా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థను అందుకోసం ప్రారంభించాడు. ఈ సంస్థకు తొలి…

శ్రీమంతుడు సినిమాతో ప్రాజెక్టులో పార్టనర్ గా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థను అందుకోసం ప్రారంభించాడు. ఈ సంస్థకు తొలి బోణీగా అయిదు కోట్ల లాభం వచ్చిందన్నది టాలీవుడ్ టాక్.

మామూలుగా అయితే రెమ్యూనిరేషన్ మాత్రం తీసుకుంటాడు. కానీ ఇప్పుడు తన డేట్స్ నే పెట్టుబడిగా పెట్టి, నిర్మాతలకు వెసులుబాటు కలిగేలా చేసాడు. తను కూడా లాభం పొందాడు.

శ్రీమంతుడు వెంచర్ కు ఎంబి సంస్థకు మహేష్ బాబు రెమ్యూనిరేషన్ పోగా అయిదు కోట్లు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు ముగ్గురూ కూడా అదే మాదరిగా లాభం చేసుకున్నారని వినికిడి. వారికీ ఇదే తొలి సినిమా.  ఫస్ట్ వెంచరే బెస్ట్ వెంచర్ అయిందన్నమాట అందరికీ.