Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ బాబుకు కోపం వచ్చింది?

మహేష్ బాబుకు కోపం వచ్చింది?

అవును నిజమే. ఎప్పుడూ కూల్ గా చిరునవ్వులు చిందించే మహేష్ బాబుకు కోపం వచ్చింది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ఇది. తన సినిమా సర్కారు వారి పాట ను ఏప్రిల్ 1న విడుదల చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఆ డేట్ కు ఆచార్య సినిమాను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.  

ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మూడో ఫేజ్ కారణంగా వాయిదా పడడం వరకు ఓకె. కానీ ఓ మాట కూడా అడగకుండా ఏప్రిల్ 1న విడుదల అని డేట్ వేయడం పై మహేష్ బాబుకు కోపం వచ్చినట్లు తెలుస్తోంది. సర్కారువారి పాట ను చకచకా రెడీ చేయమని, అవసరం అయితే తాము కూడా అదే డేట్ కు వద్దామని మహేష్ నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. 

గమ్మత్తేమిటంటే ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ అటు మహేష్ కు సన్నిహితుడే. అలాగే సర్కారు వారి పాట నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ కీ అత్యంత ఆప్తుడే. మరి ఇలా ఎందుకు జరిగినట్లో తెలియదు. 'మహేష్ చాలా కోపంగా వున్నారు. అవసరం అయితే ఏప్రిల్ 1 కే సర్కారు వారి పాట ను విడుదల చేసినా చేస్తారు. లేదూ అంటే ఏప్రిల్ 14 కు ఫిక్స్ చేస్తారు' అని మహేష్ కు సన్నిహితమైన వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా వుంటే ఆచార్య డేట్ ఏప్రిల్ 1న ఫిక్స్ చేసారు అంటే అంతకు ముందే ఆర్ఆర్ఆర్ వస్తుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాధేశ్యామ్ మార్చి 17 విడుదల అని వినిపిస్తోంది. మరి ఆర్ఆర్ఆర్ స్లాట్ ఎప్పుడో? భీమ్లా నాయక్ పరిస్థితి ఏమిటో తెలియాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?