Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ ప్రకటించాడు.. మహేష్ సంగతేంటి?

చైతూ ప్రకటించాడు.. మహేష్ సంగతేంటి?

ఏప్రిల్ 5.. ఈ డేట్ చెప్పగానే మహర్షి సినిమా గుర్తుకొస్తుంది. అంతలా రిజిస్టర్ చేశారు మేకర్స్. అలాంటి తేదీని ఇప్పుడు నాగచైతన్య ప్రకటించాడు. భార్య సమంతతో కలిసి చేస్తున్న మజిలీ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు చైతూ. మరి మహర్షి సంగతేంటి?

నిజంగా మహర్షి లైన్ లో ఉందని తెలిస్తే నాగచైతన్య అంత సాహసం చేయడు. మహేష్ కంటే చైతూకు మార్కెట్ తక్కువగా ఉందనేది ఒక పాయింట్ అయితే.. మహేష్ కోసం చైతూ అలాంటి అవాంఛిత పోటీని మొదలుపెట్టడు. పైగా దిల్ రాజు, అశ్వనీదత్ లాంటి నిర్మాతల మీద మజిలీ నిర్మాతలు కూడా అంత సాహసం చేయరు.

సో.. మహర్షి సినిమా ఆ తేదీకి రాదని పక్కాగా నిర్థారించుకున్న తర్వాతే మజిలీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారన్నమాట. ఏదో గొప్పగా ఉంటుందని విడుదల తేదీ ప్రకటించారు తప్ప మహర్షి సినిమా ఏప్రిల్ 5న వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే అక్కడున్నది వంశీ పైడిపల్లి.

సినిమాను చెక్కే రకం ఇతడు. క్వాలిటీ పేరుతో తీసిందే తీస్తుంటాడు. పైగా ఇది మహేష్ 25వ సినిమా కూడా. ఇంకేముంది భారీ సెట్స్, ఒకటే చెక్కుడు. తాజా సమాచారం ప్రకారం.. మహర్షి సినిమాను ఏప్రిల్ నెలాఖరుకు లేదా మే మొదటివారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

మహర్షి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఇదే అదనుగా సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి సినిమా విడుదల తేదీని కూడా ఏప్రిల్ లోనే ఫిక్స్ చేశారు. 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?