మహేష్ ఓకె. వైట్ల నో

ఆగడు సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్ల గోడు చాంబర్ కు ఎక్కింది. బయ్యర్లు దారుణంగా దెబ్బతిన్నామని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై సమావేశాలు, చర్చలు సాగుతున్నాయి. దీంతో హీరో మహేష్ బాబు నాలుగైదు కోట్ల…

ఆగడు సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్ల గోడు చాంబర్ కు ఎక్కింది. బయ్యర్లు దారుణంగా దెబ్బతిన్నామని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై సమావేశాలు, చర్చలు సాగుతున్నాయి. దీంతో హీరో మహేష్ బాబు నాలుగైదు కోట్ల వరకు వెనక్కు ఇచ్చేందుకు ఓకె అన్నారట. తన పారితోషికం నుంచి ఈ మేరకు రిఫండ్ ఇస్తనని మాటిచ్చారని నిర్మాతలు చాంబర్ పెద్దలకు తెలిపారట. 

అయితే శ్రీను వైట్లు మాత్రం తానేమీ ఇవ్వలేనని తెగేసి చెప్పారని తెలిసింది.తనకు దూకుడు సక్సెస్ అయినందుకు ఇచ్చినది, ఆగడుకు ఇచ్చింది కలిపి, భారీ మొత్తంగా ప్రచారం చేస్తున్నారని, అసల తనకు ఇచ్చింది నాలుగు కోట్లే అని, అందువల్ల వెనక్కు ఏమీ ఇవ్వలేనని అన్నాడట,. మరి చాంబర్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.