దేవిశ్రీ మాయలో పడిన మహేష్ బాబు

మహర్షి సినిమాలో పాటలు బాగా లేదనే విషయం అందరికీ తెలుసు. ''పదర పదరా..'', ''ఇదే కదా..'' లాంటి పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే క్లిక్ అయ్యాయి. కానీ దేవిశ్రీ వల్లనే మహర్షి…

మహర్షి సినిమాలో పాటలు బాగా లేదనే విషయం అందరికీ తెలుసు. ''పదర పదరా..'', ''ఇదే కదా..'' లాంటి పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే క్లిక్ అయ్యాయి. కానీ దేవిశ్రీ వల్లనే మహర్షి సినిమా సూపర్ గా వచ్చిందనే మాయలో ఉన్నాడు మహేష్ బాబు. ఇప్పుడు అదే భ్రమతో మరో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు.

అవును.. తన నెక్ట్స్ సినిమాను కూడా దేవిశ్రీ చేతిలోనే పెట్టాడు మహేష్ బాబు. ఫ్యాన్స్ హర్ట్ అయినా ఇదే వాస్తవం. అసలే మహర్షి సినిమాలో పాటలు బాగా లేదంటూ అసంతృప్తితో ఉన్నారు అభిమానులు. ఇప్పుడు వాళ్లను మరింత నిరాశపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు మహేష్.

నిజానికి మహేష్ సినిమాకు మరోసారి దేవిశ్రీని తీసుకోవడం వెనక మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఈ సంక్రాంతికి వచ్చిన అనీల్ రావిపూడి సినిమా ఎఫ్2 బ్లాక్ బస్టర్ అయింది. ఆ సెంటిమెంట్ తో వచ్చే సంక్రాంతికి సిద్ధంకానున్న మహేష్ సినిమా కోసం కూడా దేవిశ్రీనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట అనీల్ రావిపూడి.

ఓవైపు హీరో, మరోవైపు దర్శకుడు ఫిక్స్ అయిన తర్వాత ఇక ఆ నిర్ణయాన్ని మార్చే దమ్ము యూనిట్ లో ఎవరికీ ఉండదు. అలా మహేష్ నెక్ట్స్ సినిమాకు కూడా దేవిశ్రీనే లాక్ అయ్యాడు. మరి ఈసారి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి. అన్నట్టు ఎఫ్2 సినిమాకు కూడా దేవిశ్రీ బ్రహ్మాండమైన సంగీతమేం అందించలేదు.

రేపు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభంకాబోతోంది. ఎప్పట్లానే సెంటిమెంట్ కొద్దీ మహేష్ బాబు ఈ ఓపెనింగ్ కు హాజరుకావడం లేదు. పైగా అతడిప్పుడు హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. 

జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

కమ్మ వారి ఆత్మ ఘోష… ఆడియో కాల్..ఇంతగానా?