Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ మనసు మార్చుకున్న జ్ఞానవేల్

మళ్లీ మనసు మార్చుకున్న జ్ఞానవేల్

నిర్మాత జ్ఞానవేల్ రాజా మనసు మళ్లీ మారింది. విజయ్ దేవరకొండ నిర్మాతగా తను నిర్మించిన 'నోటా' విడుదల డేట్ మీద ఆయన ముందు వెనుక ఆడుతున్నాయి. అక్టోబర్ నాలుగు అయిదు తేదీల్లో ఫిక్స్ అన్నారు. కానీ మళ్లీ మనసు మార్చుకుని, అరవింద సమేతతో థియేటర్ల సమస్య వస్తుంది, 18న వస్తా అన్నారు. అప్పుడు తన సినిమా వుంది కష్టం అన్నారు దిల్ రాజు.

దాంతో మళ్లీ వెనక్కు వస్తారు అని వినిపించింది. కానీ అన్ని లెక్కలు వేసుకుని 18కే పక్కా అని మళ్లీ వార్తలు బయటకు వదిలారు. కానీ ఇంతలో అమర్ అక్బర్ ఆంథోని రావడంలేదు. డేట్ ఖాళీగా వుంది. పైగా దిల్ రాజు 18కి ససేమిరా అంటున్నారు. అరవింద వచ్చినా థియేటర్లు వుండేలా చూస్తామని ఆసియన్ సునీల్, దిల్ రాజు, యువి వంశీ హామీ ఇచ్చారు.

దీంతో ఇప్పుడు మళ్లీ వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. మనసు మార్చుకుని అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే నోటా సినిమా విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన టాలీవుడ్ లోని తన మిత్రులు కొందరికి ఈ ఉదయాన్నే మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరి ఈ మాటమీదే వుంటారా? ఏమో? చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?