మార్కెట్ లోకి పికె 25 మొబైళ్లు?

పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్.. ఈ పదాలకు వున్న క్రేజ్ సంగతి ఎవరైనా అంగీకరించాల్సిందే. తెలుగునాట ఆ క్రేజ్ అలాంటిది. అందుకే ఈ క్రేజ్ ను ఓ మొబైల్ కంపెనీ క్యాష్ చేసకోవాలని చూస్తున్నట్లు…

పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్.. ఈ పదాలకు వున్న క్రేజ్ సంగతి ఎవరైనా అంగీకరించాల్సిందే. తెలుగునాట ఆ క్రేజ్ అలాంటిది. అందుకే ఈ క్రేజ్ ను ఓ మొబైల్ కంపెనీ క్యాష్ చేసకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పికె 25పేరిట ఈ ఫోన్ లను అజ్ఞాతవాసి సినిమా విడుదల సమయంలో లాంచ్ చేయాలని ఇప్పటికే ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది.

ముందు విడతగా 50వేల ఫోన్లు విడుదల చేస్తామని, రెస్పాన్స్ చూసి, మళ్లీ మరో లాట్ విడుదల చేస్తామని ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు ఆంధ్రలోనే మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ వుంది.

అజ్ఞాతవాసికి బలమన క్రేజ్ తెప్పించడంలో భాగంగా ఈ ప్రపోజల్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరక్షన్ లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యయేల్ తో కలిపి పవన్ ఈ సినిమా చేసారు. ఈ సినిమాను హారిక హాసిన సంస్థ 120కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. 150కోట్ల మేరకు మార్కెట్ చేసింది.