Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా ఆల్టర్ నేటివ్ కీర్తి సురేష్

మెగా ఆల్టర్ నేటివ్ కీర్తి సురేష్

వేదాళం రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. మెహర్ రమేష్-ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కాంబినేషన్ లో నిర్మించే ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

అయితే మెగాస్టార్ లేని సీన్లు మాత్రమే ముందుగా తీసే అవకాశం వుంది. ఇదిలా వుంటే ఈ సినిమాలో కీలకమైన హీరో సిస్టర్ క్యారెక్టర్ కు సాయిపల్లవిని అనుకున్న సంగతి తెలిసిందే.

సాయి పల్లవి దాదాపు ఓకె అన్నట్లే. అయితే కీర్తి సురేష్ ను కూడా ఓ ఆల్టర్ నేటివ్ ఛాయిస్ గా చూస్తున్నారు. సాయి పల్లవికి నెరేషన్ ఇచ్చినట్లే, కీర్తి సురేష్ కు కూడా నెరేషన్ ఇవ్వడానికి మెహర్ రమేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

కీర్తి, సాయిపల్లవి ఇద్దరిలో ఎవరైనా ఒకె అని, ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోండని మెగాస్టార్ బాల్ ను దర్శక నిర్మాతల కోర్టులోకి నెట్టేసారు. కీర్తి అయితే ఎక్కడ రీచ్ వుంటుందా? సాయి పల్లవి అయితే ఎక్కువ క్రేజ్ వస్తుందా? అన్న దానిపై డిస్కషన్లు సాగుతున్నాయి. మొత్తానికి ఒక క్లారిటీ అయితే తెలుస్తోంది. లూసిఫర్ కన్నా ముందే వేదాళం రీమేక్ తెరకెక్కుతుందన్నది ఆ క్లారిటీ. 

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?