నిర్మాతగా ‘మెగా’ హీరోయిన్‌

'మెగా' హీరోయిన్‌ సిమ్రాన్‌ నిర్మాతగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌.. ఇలా టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన సిమ్రాన్‌, తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తమిళ,…

'మెగా' హీరోయిన్‌ సిమ్రాన్‌ నిర్మాతగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌.. ఇలా టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన సిమ్రాన్‌, తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తమిళ, తెలుగు సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌ అన్పించుకుందీ అందాల భామ.

పెళ్ళయ్యాక సినిమాలు తగ్గించేసిన సిమ్రాన్‌, ఆ మధ్య ఓ టీవీ సీరియల్‌లో కూడా కన్పించింది. లేటెస్ట్‌గా సిమ్రాన్‌ నిర్మాతగా అవతారమెత్తింది. 'సిమ్రాన్‌ అండ్‌ సన్స్‌' పేరుతో ఓ బ్యానర్‌ని స్థాపించి, వరసగా సినిమాలు నిర్మిస్తానంటోంది సిమ్రాన్‌. తెలుగు, తమిళంలో సినిమాలు చేయడానికి సిమ్రాన్‌ ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్స్‌ని రెడీగా పెట్టుకుందట.

నిర్మాత అంటే ఆషామాషీ వ్యవహారం కాదు గనుక, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా ఎంతో కొంత కమాండ్‌ వుండాలి గనుక, ఆయా విభాగాలపై పట్టు కోసం గత కొన్నాళ్ళుగా 'ట్రైనింగ్‌' కూడా తీసుకుంటున్న సిమ్రాన్‌, తొలుత తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితయ్యే బైలింగ్వల్‌ సినిమా చేయాలనుకుంటోందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.