మెగాస్టార్-యంగ్ టైగర్ ఒకే వేదికపై?

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి ల క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా మాంచి క్రేజీ కాంబినేషన్ గెస్ట్ లు సెట్ అయ్యారు. ఈ విషయాన్ని…

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి ల క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా మాంచి క్రేజీ కాంబినేషన్ గెస్ట్ లు సెట్ అయ్యారు. ఈ విషయాన్ని రేపు సాయంత్రం ప్రకటించనున్నారు. మహేష్ బాబు తో పాటు వేదికను మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పంచుకోనున్నారని సమాచారం.  ఈ విషయం రేపు ఉదయం కన్ ఫర్మ్ చేసుకుని, సాయంత్రం ప్రకటించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సుముఖత చెప్పేసారు. ఆయన రావడం పక్కా. ఎన్టీఆర్ కూడా ఓకె చెప్పాల్సి వుంది.  అది రేపు ఉదయం ఫైనల్ అయిపోతుంది. అయితే తివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ను తన సినిమా ఫంక్షన్ కు రమ్మని అడుగుతున్నారు, అటు వెళ్లకుండా ఇటు వస్తారా? అన్నది అనుమానం. అందువల్ల ఎన్టీఆర్ వచ్చేదీ రానిదీ రేపు ఉదయం తేలిపోయాక, సాయంత్రం ప్రకటిస్తారు.

ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా యూనిట్ డిఫెన్స్ లో పడినట్లే. మెగా హీరో ఫంక్షన్ కు రావడానికి మరే మెగా హీరో వున్నట్లు? రామ్ చరణ్ నా? పవర్ స్టార్ నా? లేక ఎన్టీఆర్ ను పిలవాలా? పైగా విశాఖలో ఫంక్షన్ చేయాలనుకున్నారు. అదీ గెస్ట్ లేకుండా. ఇప్పుడు మొత్తం ప్లాన్ మారిపోతుంది. హైదరాబాద్ కు ఫంక్షన్ చేయాలి. ధీటైన గెస్ట్ ను తెచ్చుకోవాలి.