మూడు సినిమాలు లాక్ చేసిన శౌర్య

ప్రస్తుతం చేస్తున్న @నర్తనశాల కాకుండా మూడు సినిమాలు ముగ్గురు డైరక్టర్లతో, మూడు బ్యానర్లకు లాక్ చేసాడు హీరో నాగశౌర్య. అవసరాల శ్రీనివాస్- కాంబినేషన్ లో సాయి క్రొరపాటి సినిమా ముందుగా ప్రారంభం అవుతుంది. ఆ…

ప్రస్తుతం చేస్తున్న @నర్తనశాల కాకుండా మూడు సినిమాలు ముగ్గురు డైరక్టర్లతో, మూడు బ్యానర్లకు లాక్ చేసాడు హీరో నాగశౌర్య. అవసరాల శ్రీనివాస్- కాంబినేషన్ లో సాయి క్రొరపాటి సినిమా ముందుగా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత వంశీ పైడిపల్లి శిష్యుడు, దిల్ రాజు క్యాంప్ కు చెందిన కొత్త దర్శకుడు రాజా డైరక్షన్ లో భవ్య క్రియేషన్స్ నిర్మించే సినిమా ప్రారంభిస్తారు.

ఈ రెండింటి తరువాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా వుంటుంది. గతంలో శౌర్యతో కళ్యాణవైభోగమే సినిమా అందించిన నందిని రెడ్డి ఆ తరువాత మళ్లీ మరో సినిమా ఇప్పటి వరకు చేయలేదు. మళ్లీ శౌర్యతోనే సినిమా చేయడానికి ఆమె ఫిక్సయిపోయారు.

@నర్తనశాలకు 2.4 కోట్లు

ఇదిలా వుంటే ప్రస్తుతం శౌర్య నటిస్తున్న నర్తనశాల హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ 2.4 కోట్ల రికార్డు రేటుకు అమ్ముడుపోవడం విశేషం. ఛలో సినిమాను 1.20 కోట్లకు ఇస్తే, ఇది డబుల్ అమౌంట్. నర్తనశాలలో రెండు మంచి ఫైట్లు, ఓ మాంచి ఛేజింగ్ వుండడంతో, మంచి రేటు వచ్చింది. 54లక్షల అడ్వాన్స్ తో బేరం సెటిల్ అయిపోయిందట.