Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మొత్తానికి విక్రమ్ కుమార్ సాధించాడు

మొత్తానికి విక్రమ్ కుమార్ సాధించాడు

మొత్తానికి దర్శకుడు విక్రమ్ కుమార్ సాధించాడు. తన లైన్ తో, స్క్రిప్ట్ తో బన్నీని ఒప్పించాడు. బన్నీ తన లేటెస్ట్ సినిమాను డైరక్టర్ విక్రమ్ కుమార్ తో చేయాల్సి వుంది. కానీ విక్రమ్ కుమార్ చెప్పిన లైన్, సెకండాఫ్ సెట్ కాలేదు. దాంతో ఇక విక్రమ్ కుమార్ తో సినిమా వుండదన్న వార్తలు వచ్చాయి. 

విక్రమ్ కుమార్ సమస్య ఏమిటంటే, ఆయన కథలు రెండు ఒకటి వైజయంతీలో రెండవది ఘట్టమనేని మంజుల వద్ద లాక్ అయిపోయాయి. కానీ ఎంతయినా క్రియేటర్ కదా. అందుకే మరో మాంచి లైన్ తయారుచేసి చెప్పి, బన్నీని ఒప్పించాడట. ఆ లైన్ స్క్రిప్ట్ కూడా దాదాపు రెడీ అయిపోయిందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూట్ సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. దీని తరువాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా వుంటుంది. ఆ తరువాత 2019 చివర్న సురేందర్ రెడ్డి సినిమా వుండే అవకాశం వుంది. ఆ మధ్య అంతా సురేందర్ రెడ్డి చూపు మహేష్ బాబు మీద వుంది అని వినిపించింది. అయితే మహేష్ సుకుమార్ సినిమా, వంగీసందీప్ రెడ్డి సినిమాలు బ్యాక్ టు బ్యాక ఒకే చేయాల్సి వుంది.

దాంతో సురేందర్ రెడ్డి తానే అడిగి మరీ గీతా దగ్గర అడ్వాన్స్ తీసేసుకున్నాడు. సో విక్రమ్ కుమార్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి సినిమాల వార్తలు బన్నీ ఫ్యాన్స్ కు కాస్త హుషారు తెస్తాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?