‘ముకుంద’కి నాగ్‌ ఆశీస్సులు

‘ముకుంద’ సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు సినీ నటుడు, నిర్మాత నాగార్జున. నాగ్‌ బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ‘ముకుంద’ చిత్ర దర్శకుడు, హీరోతోపాటు హీరో తండ్రి కూడా హాజరయ్యారు.…

‘ముకుంద’ సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు సినీ నటుడు, నిర్మాత నాగార్జున. నాగ్‌ బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ‘ముకుంద’ చిత్ర దర్శకుడు, హీరోతోపాటు హీరో తండ్రి కూడా హాజరయ్యారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఇదివరకే నాగార్జునకి పరిచయం. ‘కొత్త బంగారు లోకం’ కథని తొలుత నాగార్జునకే చెప్పాడట శ్రీకాంత్‌ అడ్డాల. ఈ విషయం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో పాల్గొన్న శ్రీకాంత్‌ అడ్డాల స్వయంగా చెప్పాడు.

ఇక, ‘ముకుంద’ టీమ్‌కి విషెస్‌ అందిస్తూ, ఓ పెద్ద హీరోకి వారసుడిగా తెరంగేట్రం చేస్తున్నప్పుడు ఆడియన్స్‌లో అంచనాల్ని తట్టుకోవడం కష్టమనీ, ఆ విషయం తనకు స్వీయ అనుభవమని, ధైర్యంగా ముందడుగు వేయాలని హీరో వరుణ్‌తేజకి నాగార్జున సూచించాడు. కొడుకుని లాంఛ్‌ చేస్తున్నప్పుడు ఏ తండ్రి అయినా ఎంత టెన్షన్‌ పడ్తాడో, ఆ టెన్షన్‌ తానూ అనుభవించాను కాబట్టి, నాగబాబు టెన్షన్‌ని అర్థం చేసుకోగలనన్నాడు నాగార్జున.

‘ముకుంద’ గొప్ప విజయం సాధించాలనీ, చిరంజీవి ఫ్యామిలీ నుంచి వస్తోన్న వరుణ్‌ తేజ, చిరంజీవి కన్నా పెద్ద స్టార్‌ డమ్‌ సంపాదించాలనీ నాగార్జున మనస్ఫూర్తిగా ఆకాంక్షించాడు. ఓ కొత్త హీరోకి ఇంతకన్నా సినీ పరిశ్రమలోకి హార్టీ వెల్‌కమ్‌ ఇంకేముంటుంది.?