చైతూ కూడా మైక్ అందుకోబోతున్నాడు

గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన పాటపై, అతడి వాయిస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇవన్నీ ఓ వైపు గమనిస్తూనే మరోవైపు తను కూడా పాట…

గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన పాటపై, అతడి వాయిస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇవన్నీ ఓ వైపు గమనిస్తూనే మరోవైపు తను కూడా పాట పాడ్డానికి రెడీ అవుతున్నాడు నాగచైతన్య. అవును.. తన అప్ కమింగ్ మూవీలో చైతూ ఓ పాట పాడబోతున్నాడు.

వెంకీ-చైతూ కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. బాబి డైరక్షన్ లో, ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేశారు. సినిమాలో సందర్భానుసారం వచ్చే ఓ పాటలో చైతూతో పాడించాలని నిర్ణయించారు.

హీరోలతో పాటలు పాడించడం తమన్ కు చాలా ఇష్టం. గతంలో ఎంతోమంది హీరోలతో పాటలు పాడించాడు ఈ సంగీత దర్శకుడు. ఇప్పుడు చైతూను కూడా ఆ లిస్ట్ లోకి చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈ ప్రతిపాదన ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, చైతూ వాయిస్ సాంగ్స్ కు సూట్ అవుతుందా అనేది పెద్ద డౌట్. కాస్త జీరగా ఉంటుంది నాగచైతన్య గొంతు. అతడి డైలాగ్ డెలివరీనే నెమ్మదిగా ఉంటుంది. చైతూ వాయిస్ పై కంప్లయింట్స్ ఇప్పటివి కావు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్నవే. అలాంటి హీరో ఇప్పుడు మైక్ పుచ్చుకొని పాట పాడబోతున్నాడు.